అన్వేషించండి

Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి

Padma Awards 2025 | పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, తాము ప్రతిపాదించిన కొందరు ప్రముఖులను మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Padma Awards To AP And Telangana | హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. కానీ పద్మ అవార్డులలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతమంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించిన మోదీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం 5 అవార్డులు  కూడా ప్రకటించకపోవడం సరికాదన్నారు. మేధావులు, ప్రముఖులు, కళాకారులైన చుక్కా రామయ్య, గద్దర్‌, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీరిలో ఎవరికీ పద్మ పురస్కారాలు ప్రకటించకపోవడం 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని రేవంత్ అన్నారు. పద్మ అవార్డులలో తెలంగాణపై చూపిన వివక్ష, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలనే భావిస్తున్నారని సమాచారం.

పద్మ పురస్కారాల విజేతలకు రేవంత్ రెడ్డి అభినందనలు

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, డాక్ట‌ర్ దువ్వూరి నాగేశ్వ‌ర్‌రెడ్డి, మంద కృష్ణ మాదిగ‌, దివంగ‌త మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణిశర్మ, కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య పంచముఖికి ప‌ద్మ‌ పుర‌స్కారాలు రావడంపై రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆయా ప్రముఖులు వారు ఎంచుకున్న రంగంలో చేసిన విశేష సేవలు, కృషి వారిని దేశంలోని ఉన్న‌త పౌర పుర‌స్కారాల‌కు ఎంపికయ్యేలా చేశాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి ఏడాది పద్మ పురస్కారాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటిస్తుంది. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. వీరిలో 7 మందికి దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, విద్య, క్రీడలు, కళలు, వైద్యం, సాహిత్యం వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసి, ఎంతో సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పౌర పురస్కారాలు ప్రకటించి గౌరవిస్తుంది. 

Also Read: Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
Tamil Nadu Vijay: తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
Steve Smith Records: 96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
Embed widget