అన్వేషించండి

Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి

Padma Awards 2025 | పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, తాము ప్రతిపాదించిన కొందరు ప్రముఖులను మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Padma Awards To AP And Telangana | హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. కానీ పద్మ అవార్డులలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతమంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించిన మోదీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం 5 అవార్డులు  కూడా ప్రకటించకపోవడం సరికాదన్నారు. మేధావులు, ప్రముఖులు, కళాకారులైన చుక్కా రామయ్య, గద్దర్‌, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు లాంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీరిలో ఎవరికీ పద్మ పురస్కారాలు ప్రకటించకపోవడం 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని రేవంత్ అన్నారు. పద్మ అవార్డులలో తెలంగాణపై చూపిన వివక్ష, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలనే భావిస్తున్నారని సమాచారం.

పద్మ పురస్కారాల విజేతలకు రేవంత్ రెడ్డి అభినందనలు

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌, డాక్ట‌ర్ దువ్వూరి నాగేశ్వ‌ర్‌రెడ్డి, మంద కృష్ణ మాదిగ‌, దివంగ‌త మిర్యాల అప్పారావు, మాడుగుల నాగఫణిశర్మ, కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య పంచముఖికి ప‌ద్మ‌ పుర‌స్కారాలు రావడంపై రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆయా ప్రముఖులు వారు ఎంచుకున్న రంగంలో చేసిన విశేష సేవలు, కృషి వారిని దేశంలోని ఉన్న‌త పౌర పుర‌స్కారాల‌కు ఎంపికయ్యేలా చేశాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతి ఏడాది పద్మ పురస్కారాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటిస్తుంది. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. వీరిలో 7 మందికి దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, విద్య, క్రీడలు, కళలు, వైద్యం, సాహిత్యం వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసి, ఎంతో సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పౌర పురస్కారాలు ప్రకటించి గౌరవిస్తుంది. 

Also Read: Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget