అన్వేషించండి

Telangana ప్రభుత్వాన్ని పడగొడతారా? ఫాంహౌస్ ఇటుకలు కూడా మిగలవు: రేవంత్ రెడ్డి వార్నింగ్

Telangana News: తమ కూలగొట్టే దమ్ము ఎవరికీ లేదని, ఎవరైనా ప్రయత్నిస్తే ఫాంహౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana CM Revanth Reddy comments at Praja Deevena Sabha in Medchal: మేడ్చల్: గత కొన్ని రోజుల నుంచి కొందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కూతలు కూస్తున్నారని, కానీ ఎవరైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే, ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. మేడ్చల్ లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రజా దీవెన సభ (Praja Deevena Sabha)లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో... గత పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సమస్యలను వేగంగా పరిష్కరించి.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు.. 
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కూలుతదని కొందరు అంటున్నారు. మేం అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదు. మా ప్రభుత్వాన్ని కూల్చేంత మొనగాడు ఎవడైనా ఉన్నాడా ? ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే.. ఫామ్ హౌస్ గోడలే కాదు, ఇటుకలు కూడా మిగలవు అని గుర్తుంచుకోవాలి. రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా?.

ఆడబిడ్డలకు 43శాతం ఉద్యోగాలు 
ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరని ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంది. మేం భర్తీ చేసిన 30వేల ఉద్యోగాల్లో 43శాతం ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాం. పేర్లతో సహా లెక్కలు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేతనైతే కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిస్తే.. లెక్కలు చెబుతాం. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లు నేడు సిగ్గులేకుండా వెళ్లి ధర్నా చౌక్ లో ధర్నా చేస్తుండ్రు. తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే కేసీఆర్‌ను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది.. హరీష్ రావు మేడిగడ్డకు రమ్మంటే వస్తలేడు. అసెంబ్లీలో మైక్ ఇస్తే మాట్లాడడు. పదేళ్లలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను కూడా తీర్చలేకపోయారు. మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు రావాలి, భూముల విలువ పెరగాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఎందుకు మోదీ?
లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections 2024) బీజేపీకి 400 సీట్లు వస్తాయంటున్న ప్రధాని మోదీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ పాలనకు ఇక కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ఎన్డీయేను అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఎన్నడూ రాని ఈటెల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు? అని రేవంత్ ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలను ఓడిస్తే, మల్కాజ్‌గిరికి వచ్చి గెలుస్తా అని ఎలా అనుకుంటున్నాడో అన్నారు. మేడ్చల్ కు మెట్రో రావాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget