News
News
వీడియోలు ఆటలు
X

CM KCR News: వరి కోతలు ఆపండి, రైతులకు సీఎం కేసీఆర్ సూచన, తడిసిన ధాన్యాన్ని కొంటామని భరోసా

CM KCR News: రాష్ట్రంలో ఉన్న రైతులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. తడిసిన ధాన్యాన్ని కూడా మామూలు ధరకే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 

FOLLOW US: 
Share:

CM KCR News: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించినట్లుగానే తడిసిన ధాన్యానికి కూడా ధర చెల్లిస్తామని వివరించారు. వ్యవసాయాన్ని కాపాడుతూ... కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరి ధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే పూర్తయ్యేలా ఎలాంటి విధానాలు అవలంభిచాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని కూడా చైతన్యం చేయాలని చెప్పారు.

ఎంత వరి పండించినా చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తున్నాం..!

వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ ఊహించని రీతిలో సత్ఫలితాలను ఇస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో రాష్ట్రాలను అధిగమనిస్తూ... తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని చెప్పారు. రైతులు ఎంత పంట పండించినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు కోర్చి అయినా గింజ లేకుండా కల్లాల వద్దకే వెళ్లి సేకరిస్తుందని పేర్కొన్నారు. రైతుల కోసం ఇంత చిత్త శుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపలేమని చెప్పారు. అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదని వివరించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తూ ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఆర్థికంగా రాష్ట్ర ఖజానాలు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని వివరించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని అన్నారు.  

పంట కోతలను నాలుగైదు రోజులు ఆపితే బాగుంటుంది..!

అయితే పంట కోతలను ఓ నాలుగైదు రోజులు ఆపితే బాగుంటుందని సీఎం కేసీఆర్ అన్నదాతలకు సూచించారు. కొన్ని చోట్ల అకాల వర్షాలు కొనసాగుతుండడం వల్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అయినా త్వరలోనే సేకరణ పూర్తి చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అని కుమార్ చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు కొనసాగనున్నాయని అధికారులు వివరించారు. దీంతో అప్పటి దాకా వరి పంటను కోయకుండా ఆపటం మంచిదని, దీని వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్త పడొచ్చని సూచించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మార్చి నెల తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆలోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.  

Published at : 03 May 2023 10:06 AM (IST) Tags: Hyderabad CM KCR Review unseasonal rains Telangana News Crop Loss

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు అరెస్ట్

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

Errabelli Dayakar Rao: త్వ‌ర‌లో బీసీ కుల వృత్తుల వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం: మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: త్వ‌ర‌లో బీసీ కుల వృత్తుల వారికి రూ.1ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హ‌కారం: మంత్రి ఎర్రబెల్లి

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

టాప్ స్టోరీస్

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!