అన్వేషించండి

కల్వకుర్తికి అన్నింటా అన్యాయమే, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు. తనతో పాటు ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకుందన్నారు నారాయణరెడ్డి. కల్వకుర్తి నియోజకవరంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్న ఆయన, ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదని విమర్శించారు. రైతుల నుంచి భూమిని సమీకరించినా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. భూములు పోయాయన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, నష్టపరిహారంపై ఎన్నో సార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఏం చేయలేకపోయా
కల్వకుర్తి ప్రాజెక్టు కోసం భూములు పోయినా, ఆ కాలువ ద్వారా నీళ్లు మాత్రం రాలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి. భూములు కోల్పోయిన రైతులకు రైతుబంధు రావడం లేదన్నారు. తాను పదవ తరగతి చదువుకున్న పాఠశాలలోనే జూనియర్ కాలేజ్ నడుస్తోందని, డిగ్రీ కాలేజ్ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ లో ఉందన్నారు కసిరెడ్డి నారాయణరెడ్డి. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, తాను అక్కడ అసహాయ నేతగా మిగిలిపోయానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందన్న ఆయన, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కల్వకుర్తి ప్రజలే కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారని, గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, కల్వకుర్తి అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానన్నారు. 

కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా ? -పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మమ్మల్ని మరుగుజ్జులు అంటారా ? కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా ? అద్దంలో ముఖం చూసుకోవాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని విమర్శించారు.  చెప్పులు వేసుకునే, ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని గుర్తు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమలు చేస్తున్న పథకాలు, తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావు, కేటీఆర్ చిత్త కార్తె కుక్కల్లా రాష్ట్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. 

బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు 36 సీట్లే-రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు 36 సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లన్నికాంగ్రెస్ పార్టీవేనని చెప్పుకొచ్చారు. సామాజిక వర్గాల నుంచి వస్తున్న అంశాలను పరిశీలించి టిక్కెట్లు ఇస్తామన్నారు. రాని వారికి ఇతర పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్నారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం వరకు చేసిన ఖర్చుకు, పిలిచిన టెండర్లకు పొంతన లేదన్నారు. రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణమని చెప్పి రూ.1200 కోట్లు ఖర్చు చేశారన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Embed widget