అన్వేషించండి

Husnabad Tension : హుస్నాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత, గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్, ప్రజాప్రతినిధులపై దాడి!

Husnabad Tension : గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళనలతో హుస్నాబాద్ రణరంగంలా మారింది. గుడాటిపల్లి గ్రామస్థులపై పోలీసుల లాఠీలు ఝళిపించారు. భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడి కూడా జరిగింది.

 Husnabad Tension : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులైన గుడాటిపల్లి వాసులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు నిరసనగా మంగళవారం ఉదయం నుంచి హుస్నాబాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు భూనిర్వాసితులు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. హుస్నాబాద్‌ మల్లెచెట్టు చౌరస్తాలో నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఈ ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులు టీఆర్ఎస్ జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలపై దాడికి పాల్పడడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంలా మారిపోయింది. ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

గ్రామస్థులపై పోలీసుల లాఠీఛార్జ్! 

ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని భూ నిర్వాసితులు స్పష్టంచేశారు. నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నా తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ- హుస్నాబాద్‌ ప్రధాన రహదారిపై ఆందోళనకారులు వంటా వార్పు, రాస్తారోకో నిర్వహించారు. తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీల్లేదని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులను కట్టడిచేసేందుకు పోలీసులు దారుణంగా వ్యవహిరంచారు. గ్రామంలో విద్యుత్ నిలిపివేసి అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి ఆందోళనకారుల్లో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మహిళలని కూడా చూడకుండా అడ్డుకున్న వారిపై లాఠీఛార్జ్ చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

అర్ధరాత్రి ఇళ్లలో చోరబడి పోలీసుల బలప్రయోగం! 

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురవుతున్న గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్ లో పలువురు గాయపడ్డారు. పోలీసుల నిర్బంధాలు, నిర్వాసితుల ఆందోళనల మధ్య సోమవారం నీటిపారుదలశాఖ సర్వే పనులు చేపట్టింది. భూములు కోల్పోతున్న నిర్వాసితులపై జరిగిన పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్‌ నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పద్మ తదితరులు భూనిర్వాసితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.

Also Read : Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్, బీజేపీ నేతలు అరెస్టు

Also Read : Revanth Reddy On Undavalli : కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget