అన్వేషించండి

Telangana News : తలకిందులుగా నిలబడి నిరసన - ధరణి సమస్యపై రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు పోరాటం వైరల్

Farmer Protest : రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు తలకిందులుగా నిలబడి తెలిపిన నిరసన వైరల్ అయింది. తన భూమి విషయంలో రైతులు సమస్య పరిష్కరించడం లేదని ఆయనంటున్నారు.

RangaReddy farmer stands upside down For Protest :  తెలంగాణలో ధరణి  పేరుతో తీసుకు వచ్చిన భూసంస్కరణ కారణంగా ఎంతో మంది రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి అధికారులు నానా తిప్పలు పెడుతున్నారు.  ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో ఇలాంటి ధరణి సమస్యలే అరవై శాతం వరకూ ఉంటున్నాయి. అందుకే తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని తీసేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంకా ధరణిని రద్దు చేయలేదు. తమ భూమి విషయంలో ఏర్పడిన సమస్యల కోసం రైతులు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

తమ భూమిని నిషేధ జాబితాలో చేర్చారని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతు జీవన్                  

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహంపట్నం తహశీల్ దార్ కార్యాలయంలో ఓ రైతు తలకిందులుగా నిలబడి నిరసన చేపట్టారు. అప్పటికే ఎన్నో సార్లు కార్యాలయానికి వచ్చినా పట్టించుకోలేదని ఆ రైతు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే అధికారుల మీద ఆవేశ పడితే తనకే నష్టం కాబట్టి.. వినూత్నంగా ధర్నా చేయాలనుకున్నాడు. వెంటనే తలకిందులుగా నిలబడ్డాయి. అలా దాదాపుగా గంట సేపు తన నిరసన వ్యక్తం చేశాడు. యోగాలో ఇలా నిలబడటాన్ని శీర్షాసనం అంటారు. రైతు నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సీలింగ్  భూమి కాదని అన్ని ఆధారాలు సమర్పించినా ధరణిలో సీలింగ్ భూమిగా నమోదు             

నిరసన తెలిపిన రైతు పేరు ఉన్నితాల జీవన్. ఆయన విద్యాధికుడు కూడా. హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకున్నారు. జీవన్  తల్లి ఉన్నితాల జయసుధ పదిహేనేళ్ల కిందట మెట్టు సైదారెడ్డి అనే వ్యక్తి దగ్గర మంగలపల్లి గ్రామంలో ఎకరం32 సెంట్లను కొనుగోలు చేశారు. అయితే ధరణి వచ్చిన తర్వాత ఈ భూమిని నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఇది సీలింగ్ ల్యాండ్ కానే కాదని.. ప్రైవేటు ల్యాండేనని రికార్డులతో తన భూమిని నిషేధ జాబితా నుంచి తప్పించాలని ఆయన అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కాలం తిరిగినా వారి వద్ద నుంచి సమాధానం రావడం లేదు. గత ఎనిమిది నెలలుగా ఇబ్రహీనంపట్నం మండల కార్యాలయానికి.. కలెక్టర్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నామని జీవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎనిమిది నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో వినూత్నంగా  నిరసన                                    

అది అసలు సీలింగ్ ల్యాండ్ కాదని.. గత ఐదు దశాబ్దాల భూ రికార్డులను సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని కానీ ధరణి సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశిచిందన్నారు. ఎవరూ పని చేయడం లేదని.. తప్పక నిరసన వ్యక్తం చేశామని.. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Hyderabad Cyber Crime News: హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
హైదరాబాద్‌లో మ్యూల్ ఖాతాల గుట్టు రట్టు! 15 కోట్ల లాభం అని రూ. 1.22 కోట్లు కొట్టేశారు!
Breaking News: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నా... ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Mirzapur Movie First Look: వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
వెండితెరపైకి మున్నాభయ్యా... మిర్జాపూర్ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూశారా?
Embed widget