అన్వేషించండి

Breaking News Telugu Live Updates: న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..

Key Events
Rahul Gandhi Bharat Jodo Yatra AP and Telangana Breaking News Telugu Live Updates on 29 October 2022 Breaking News Telugu Live Updates: న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52 వ రోజుకు చేరుకోగా, తెలంగాణలో 4వ రోజు పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర మొదలుపెట్టగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్.

రాహుల్ పాదయాత్రలో నటి పూనమ్ కౌర్..
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు పూనమ్ కౌర్. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్  ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. 

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు నేడు ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 
అక్టోబర్ 19 నుంచి ఈశాన్య రుతుపవనాల వాతావరణం కొనసాగుతూ వచ్చింది. వాతావరణ శాఖ అధికారులు ఈశాన్య రుతుపవనాల రాకపై నేడు ప్రకటించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలను మనం చూశాం, కానీ ఈ సారి మరీ అంతగా కాకపోయినా నవంబర్ నెలలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుంది. తమిళనాడు వైపుగా అల్పపీడనాలు వచ్చే ప్రతి సారి నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలతో పాటుగా అన్నమయ్య, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి, అవి కూడా కోస్తా (సముద్ర తీరానికి దగ్గర) భాగాల్లో మాత్రమే ఉంటాయని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రివేల చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో  వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
సిత్రాంగ్ తుపాను తీరాన్ని దాటిన మూడు రోజులకు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేడు ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. మరోవైపు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలో వర్షాలు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు, చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలున్నాయి. నేడు సీమలోని మిగిలిన జిల్లాల్లో, ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలుండవని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

15:24 PM (IST)  •  29 Oct 2022

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

15:22 PM (IST)  •  29 Oct 2022

న్యాయరాజధానికి మద్దతుగా భూమన ర్యాలీ

రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకురావాలని మూడు రాజధానులకు  మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారాయన. ఈ కార్యక్రమంలో వేల మంది మహిళలు, యువకులు పాల్గొని మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు.

కృష్ణాపురం ఠాణా నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో వేల మంది ప్రజలు గాంధీ రోడ్డు తిలక్ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  సభలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో జరిగిన ఆత్మ గౌరవ మహా ప్రదర్శన పట్ల  ప్రజల స్పందన తెలియజేసేందుకు ఇది ఒక రిహార్సల్స్‌ మాత్రమే అన్నారు. అంచనాలకు మించి ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారని పేర్కొన్నారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget