అన్వేషించండి

Adilabad: ఈ 18న నాగోబా విగ్రహం పునః ప్రతిష్టాపన, మంత్రి కేటీఆర్‌కు మెస్రం వంశీయుల ఆహ్వానం

డిసెంబర్ 18వ తేదీన అత్యంత అరుదైన పురాతన దేవాలయం నాగోబా విగ్రహా పునః ప్రతిష్ట కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తో కలిసి మెస్రం వంశీయులు ఆహ్వానం అందజేశారు.

TS Minister KTR got invitation for Nagoba Temple Program: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో డిసెంబర్ 18వ తేదీన అత్యంత అరుదైన పురాతన దేవాలయం నాగోబా విగ్రహా పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తో కలిసి మెస్రం వంశీయులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ తప్పకుండా వస్తానని సానుకూలంగా స్పందించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో జరగవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే  తీసుకేళ్ళారు. ఈ కార్యక్రమంలో మేస్రం వంశస్థులు మరియు ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.

రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయం నిర్మాణం 
తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది. కేస్లాపూర్‌లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. మెస్రం వంశీయులు నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించగా ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాగోబా జాతరతో పాటు ఆలయ చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో తమ సొంత ఖర్చులతో నాగోబా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెస్రం కుటుంబీకుల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయ నిర్మాణం పూర్తి చేశారు.

మెస్రం వంశీయులు 1956లో చిన్నపాటి ఆలయాన్ని నిర్మించుకొని నాగోబా జాతర నిర్వహించారు. మెస్రం వంశీయుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జీ నగేశ్‌ అప్పట్లో రూ.3.80 లక్షలతో నాగోబా ఆలయంతో పాటు గర్భగుడి, సతీదేవత గుడి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మెస్రం వంశీయులు 2018 వరకు నాగోబా జాతర ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. జాతర సమయంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మెస్రం వంశీయులు నూతన నాగోబా ఆలయాన్ని అద్భు తంగా నిర్మింపజేశారు.

ఆలయ ప్రారంభోత్సవానికి మెస్రం వంశీయుల ఆహ్వానం
డిసెంబర్‌12 నుంచి 18 (Nagoba Temple Program) వరకు ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, భజన, తదితర పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు.  ఈ క్రమంలో సోమవారం నాడు మంత్రి కేటీఆర్‌ను మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే రేఖా నాయక్ కలసి నాగోబా విగ్రహం పున ప్రతిష్టాపనకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ, మహా రాష్ట్రలోని మెస్రం వంశీయులు ఉండే గ్రామాల్లో నాగోబా ఆలయం, నూతన కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఐటీడీఏ పీవో, జిల్లా స్థాయిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితర ప్రతినిధులను, బదిలీపై వెళ్లిన వారిని ఈ వంశీయులు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేక బారికేడ్లతో పాటు రంగు రంగుల లైట్లను అలంకరించి నూతన ఆలయం చుట్టూ ప్రాంతంలో సీసీ నిర్మించారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget