అన్వేషించండి

Nizamabad News: సిజేరియన్లపై కలెక్టర్ సీరియస్ - రూ.5 వేలు పెనాల్టీ అని వైద్య సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్

ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరి ప్రైవేటుకు వెళ్తే విచారణ జరపాలి. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. వైద్యాధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెరిగిపోతున్న సీజేరియన్లపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే సిజేరియన్లను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు ఆదేశించారు. సిజేరియన్లను అరికట్టేందుకు ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సిజేరియన్లను ప్రోత్సహించటాన్ని తీవ్రంగా తప్పుప్టారు కలెక్టర్ నారాయణ రెడ్డి.  
 
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. 
సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఘటనలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్.ఎంలు మాట్లాడుతూ, తాము గర్భిణీలను ప్రసవాల కోసం ఫ్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే, వారికి సరిగా వైద్యసేవలందించని కారణంగా గర్భిణీలు అసంతృప్తితో కాన్పు జరగకముందే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లకు వెళ్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీలు అర్ధాంతరంగా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళిపోతే అందుకు గల కారణాలను సమగ్ర విచారణ ద్వారా నిగ్గు తేల్చాలన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇందుకు బాధ్యులైన వైద్యులకు రూ. ఐదు వేల చొప్పున పెనాల్టీ వేయాలని సూపరింటెండెంట్లకు సూచించారు. స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వెల్లడైతే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సంతృప్తికరంగా వైద్యసేవలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వారికి మరింత మెరుగైన సేవలందేలా చూడాలన్నారు. దీనివల్ల అనవసర సిజేరియన్ బారి నుండి వారిని కాపాడినట్లు అవుతుందని, ఫ్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లోనూ నమ్మకం పెంపొందించిన వారవుతారని చెప్పారు.
 
ప్రభుత్వాస్పిత్రికి వస్తే అన్ని సదుపాయాలు కల్పించాలి 
ఫ్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏ ఎన్ ఎంలు, పీహెచ్ సి వైద్యులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. అదే సమయంలో వారి ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల కోసం చేరిన గర్బిణీలకు సంతృప్తికరంగా సేవలందించే బాధ్యత గైనిక్ వైద్యాధికారులు, ఆసుపత్రికి చెందిన సిబ్బందిపై ఎంతైనా ఉందన్నారు. అన్ని సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నందున ప్రైవేట్ కంటే మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయమై పూర్తి పర్యవేక్షణ జరుపుతూ సంపూర్ణమైన అజమాయిషీ కలిగి ఉండాలని కలెక్టర్ సూపెరింటెండెంట్లకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. గర్భిణీలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి హితవు పలికారు.
 
ప్రసవాల కోసం గర్భిణీలను ఆశాలు, ఏ.ఎన్.ఎంలు ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వారిని లేబర్ రూమ్ వద్దకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ప్రసవాలపై  ప్రత్యేక బృందాలచే సమగ్ర పరిశీలన జరిపిస్తున్నామని, ఈ సందర్భంగా ఎవరైనా అనవసర సిజీరియన్లు చేసినట్లు, ఇతరాత్ర తప్పిదాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget