అన్వేషించండి

Nizamabad Tourism: నిజామాబాద్‌లో పిరమిడ్ కట్టడాలు- పర్యాటకంగా వృద్ధి చేస్తే ప్రభుత్వానికి ప్రయోజనాలు

రాజసం ఉట్టిపడేలా సిర్నాపల్లి సంస్థానం. 119 ఏళ్లైనా నేటికీ చెక్కు చెదరడం లేదు. నాటి చరిత్రను కళ్లకు కట్టి చూపుతున్న వీటిని అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

తెలంగాణలో ఒకప్పుడు ఎటు చూసినా గడిల పాలన. గడి కోటలే అప్పటి సచివాలయాలు. గడిల కేంద్రంగా పాలన సాగేది. రాజసం ఉట్టిపడేలా సంస్థానాలు. ఒకప్పటి ఇందూరు జిల్లా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా... గడిల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ఇందులో ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో సిర్నాపల్లి సంస్థానానికి ఎంతో చరిత్ర ఉంది.

నాడు సంస్థానం- నేడు పర్యాటక ప్రదేశం

ఒకప్పుడు అదో సంస్థానం. రాజసంలో వైవిద్య ప్రాంతం. ఎన్నో ప్రత్యేకతలు రాజసం ఉట్టిపడే... సిర్నాపల్లి సంస్థానానం ఎంతో ప్రత్యేకం. రాణి శీలం జానకీ భాయి ఏలిన చరిత్రతోపాటు ఎన్నో ప్రత్యేకలు సొంతం చేసుకుంది ఈ సిర్నాపల్లి సంస్థానం. కాకతీయులు, కుతుబ్‌షాల తర్వాత నిజాంలు పాలించిన సంస్థానం సిర్నాపల్లి. వందల ఏళ్లుగా అనేక మంది పాలనలో ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామం. నిజామాబాద్ జిల్లాలోనే అతి పెద్ద సంస్థానంలో ఒకటి.

శీలం జానకీ భాయి నిజామాబాద్‌ లక్ష్మీ భాయి

నిజాం కాలంలో మొదట్లో నర్సాగౌడ్ అధీనంలో ఉండేది. ఆ తర్వాత శీలం ప్రతాప్ రెడ్డి ఆధీనంలోకి వచ్చింది ఈ సంస్థానం. ఆయన చిన్న వయసులోనే చనిపోతే ఆయన భార్య శీలం జానకీ భాయి. ఈ రాణి కూడా చిన్న వయసులోనే సంస్థానం బాధ్యతలు చేపట్టింది. శీలం జానకీ భాయికి సంతానం లేకపోవటంతో మెదక్ జిల్లాకు చెందిన రామ లింగారెడ్డిని దత్తత తీసుకుని పెంచింది. శీలం జానకీ భాయి చాలా కాలం పాలన సాగించింది. ఈమె హయాంలో చాలా అభివృద్ది జరిగిందని చరిత్ర చెబుతుంది. దాదాపు వంద గ్రామాలు ఈ సంస్థానంలో అధీనంలో ఉండేవి. సిర్నాపల్లి, ఇందల్వాయి, జానకం పేట్, నవీపేట్, రెంజల్ మండలాల్లోని గ్రామాలు మరికొన్ని తండాలు ఈ సంస్థానం కింద వచ్చేవి. ఈ గ్రామాలన్నింటికీ శీలం జానకీ భాయి రాణి. పన్ను వసూళ్లలో పోలీసు వ్యవస్థ శీలం జానకీ భాయి కనుసన్నల్లోనే ఉండేది.  ఈ సిర్నాపల్లి గడి రాణి నివాసం కోసం ఉపయోగించేది.

ఆకట్టుకునే డిజైన్లు

రాణి శీలం జానకీ భాయి నివాసం కోసం ఉపయోగించిన సిర్నాపల్లి సంస్థానం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గడి ఎంతో కళాత్మకంగా ఉంటుంది. గడి చుట్టూ లోతైన కందకం ఉండేది. కందకంలో రాణి రక్షణ కోసం మోసళ్లు వదిలేవారు. అప్పల్లో ఈ గడి ఎంత ఉండేదో సిర్నాపల్లి గ్రామం అంతే ఉండేది. రాణి ఎంత స్థలంలో నివసించే వారో ఆ గ్రామం కూడా అంతే స్థలంలో ఉండేదని చరిత్ర. గడిలో అడుగుపెట్టే ముందు ప్రాంగణంలో పెద్ద కమాన్ ఉండేది. ప్రస్తుతం ఒక్క బురుజే మిగిలింది. ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అనేక భవనాలు ఉండేవి. సిర్నాపల్లి గడిలోకి వెళ్లగానే పెద్ద రాతి భవనం కనిపిస్తుంది. భవనం ముందు భాగం ఆర్చీ డిజైన్ లతో అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లను గోదీప్ డిజైన్లు అంటారు. పశ్చిమ యూరప్ లో ఎక్కువగా కనిపిస్తాయ్. ఈ ఆర్కిటెక్చర్ మధ్య యుగంలో భారత్ కు వచ్చాయ్. రాళ్లతో మలిచిన ఈ ఆర్చ్ లు రాతి స్థంబాల ఆధారంగా నిలబడతాయి. ఆ రోజుల్లో సంస్థానాలకు విదేశాలతో సంబంధం ఉండేవని ఈ ఆర్కిటెక్చర్ చూస్తే తెలుస్తుంది. ఈ భవనం డిజైన్లలో వాడే వస్తువుల్లో వైవిద్యం కనిపిస్తుంది.

రెండంతస్తుల భవనంపైన రాతి సింహాలు, పిరమిడ్ల డిజైన్లు ఆకర్షిస్తాయి. పైకి మాత్రమే కాదు పిరమిడ్ ఆకారమంలో రాయిని మార్చడానికి ఎంతో నైపుణ్యం కావాలి. నాటి పాలకుల రాజసం, గొప్పతనం చాటుకోవటానికి ఇలా నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ డూప్ లెస్ బిల్డింగ్ లో రెండు విశాలమైన హాళ్లు,  20 గదులు నిర్మించారు. ఈ కోటను జానకీ బాయి మరింత లక్జరీగా ఏర్పాటు చేసుకున్నారు. భవన నిర్మాణంలో ప్రత్యేకతలు ఎన్నోఉన్నాయ్. ఏ కాలంలోనైనా భవనం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది. గడిలో ద్వారాలు ఆటోమెటిక్ గా మూసుకుపోతాయ్. ఈ ద్వారాలను లండన్ నుంచి తెప్పించారని చరిత్ర. గడిలో ఎవరైనా ఆకస్మికంగా చొరబాటు చేస్తే తప్పించుకోవటానికి సిక్రేట్ మార్గం ఉండేదట. ఆ తర్వాత దోర వారసులు ఈ సంస్థానంలోని భూమిని పాఠశాల కోసం ఇచ్చారు. అయితే 119 ఏళ్ల తర్వాత కూడా సిర్నాపల్లి సంస్థానం చెక్కు చెదరకుండా ఉంది. నిజామాబాద్ జిల్లాను పాలించిన రాణి శీలం జానకీభాయి నివాసం ఉన్న ఈ సంస్థానంను పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు స్థానికులు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget