అన్వేషించండి

Nizamabad Tourism: నిజామాబాద్‌లో పిరమిడ్ కట్టడాలు- పర్యాటకంగా వృద్ధి చేస్తే ప్రభుత్వానికి ప్రయోజనాలు

రాజసం ఉట్టిపడేలా సిర్నాపల్లి సంస్థానం. 119 ఏళ్లైనా నేటికీ చెక్కు చెదరడం లేదు. నాటి చరిత్రను కళ్లకు కట్టి చూపుతున్న వీటిని అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

తెలంగాణలో ఒకప్పుడు ఎటు చూసినా గడిల పాలన. గడి కోటలే అప్పటి సచివాలయాలు. గడిల కేంద్రంగా పాలన సాగేది. రాజసం ఉట్టిపడేలా సంస్థానాలు. ఒకప్పటి ఇందూరు జిల్లా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా... గడిల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ఇందులో ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో సిర్నాపల్లి సంస్థానానికి ఎంతో చరిత్ర ఉంది.

నాడు సంస్థానం- నేడు పర్యాటక ప్రదేశం

ఒకప్పుడు అదో సంస్థానం. రాజసంలో వైవిద్య ప్రాంతం. ఎన్నో ప్రత్యేకతలు రాజసం ఉట్టిపడే... సిర్నాపల్లి సంస్థానానం ఎంతో ప్రత్యేకం. రాణి శీలం జానకీ భాయి ఏలిన చరిత్రతోపాటు ఎన్నో ప్రత్యేకలు సొంతం చేసుకుంది ఈ సిర్నాపల్లి సంస్థానం. కాకతీయులు, కుతుబ్‌షాల తర్వాత నిజాంలు పాలించిన సంస్థానం సిర్నాపల్లి. వందల ఏళ్లుగా అనేక మంది పాలనలో ప్రాధాన్యం సంతరించుకుంది. ధర్పల్లి మండలంలోని సిర్నాపల్లి గ్రామం. నిజామాబాద్ జిల్లాలోనే అతి పెద్ద సంస్థానంలో ఒకటి.

శీలం జానకీ భాయి నిజామాబాద్‌ లక్ష్మీ భాయి

నిజాం కాలంలో మొదట్లో నర్సాగౌడ్ అధీనంలో ఉండేది. ఆ తర్వాత శీలం ప్రతాప్ రెడ్డి ఆధీనంలోకి వచ్చింది ఈ సంస్థానం. ఆయన చిన్న వయసులోనే చనిపోతే ఆయన భార్య శీలం జానకీ భాయి. ఈ రాణి కూడా చిన్న వయసులోనే సంస్థానం బాధ్యతలు చేపట్టింది. శీలం జానకీ భాయికి సంతానం లేకపోవటంతో మెదక్ జిల్లాకు చెందిన రామ లింగారెడ్డిని దత్తత తీసుకుని పెంచింది. శీలం జానకీ భాయి చాలా కాలం పాలన సాగించింది. ఈమె హయాంలో చాలా అభివృద్ది జరిగిందని చరిత్ర చెబుతుంది. దాదాపు వంద గ్రామాలు ఈ సంస్థానంలో అధీనంలో ఉండేవి. సిర్నాపల్లి, ఇందల్వాయి, జానకం పేట్, నవీపేట్, రెంజల్ మండలాల్లోని గ్రామాలు మరికొన్ని తండాలు ఈ సంస్థానం కింద వచ్చేవి. ఈ గ్రామాలన్నింటికీ శీలం జానకీ భాయి రాణి. పన్ను వసూళ్లలో పోలీసు వ్యవస్థ శీలం జానకీ భాయి కనుసన్నల్లోనే ఉండేది.  ఈ సిర్నాపల్లి గడి రాణి నివాసం కోసం ఉపయోగించేది.

ఆకట్టుకునే డిజైన్లు

రాణి శీలం జానకీ భాయి నివాసం కోసం ఉపయోగించిన సిర్నాపల్లి సంస్థానం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గడి ఎంతో కళాత్మకంగా ఉంటుంది. గడి చుట్టూ లోతైన కందకం ఉండేది. కందకంలో రాణి రక్షణ కోసం మోసళ్లు వదిలేవారు. అప్పల్లో ఈ గడి ఎంత ఉండేదో సిర్నాపల్లి గ్రామం అంతే ఉండేది. రాణి ఎంత స్థలంలో నివసించే వారో ఆ గ్రామం కూడా అంతే స్థలంలో ఉండేదని చరిత్ర. గడిలో అడుగుపెట్టే ముందు ప్రాంగణంలో పెద్ద కమాన్ ఉండేది. ప్రస్తుతం ఒక్క బురుజే మిగిలింది. ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అనేక భవనాలు ఉండేవి. సిర్నాపల్లి గడిలోకి వెళ్లగానే పెద్ద రాతి భవనం కనిపిస్తుంది. భవనం ముందు భాగం ఆర్చీ డిజైన్ లతో అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లను గోదీప్ డిజైన్లు అంటారు. పశ్చిమ యూరప్ లో ఎక్కువగా కనిపిస్తాయ్. ఈ ఆర్కిటెక్చర్ మధ్య యుగంలో భారత్ కు వచ్చాయ్. రాళ్లతో మలిచిన ఈ ఆర్చ్ లు రాతి స్థంబాల ఆధారంగా నిలబడతాయి. ఆ రోజుల్లో సంస్థానాలకు విదేశాలతో సంబంధం ఉండేవని ఈ ఆర్కిటెక్చర్ చూస్తే తెలుస్తుంది. ఈ భవనం డిజైన్లలో వాడే వస్తువుల్లో వైవిద్యం కనిపిస్తుంది.

రెండంతస్తుల భవనంపైన రాతి సింహాలు, పిరమిడ్ల డిజైన్లు ఆకర్షిస్తాయి. పైకి మాత్రమే కాదు పిరమిడ్ ఆకారమంలో రాయిని మార్చడానికి ఎంతో నైపుణ్యం కావాలి. నాటి పాలకుల రాజసం, గొప్పతనం చాటుకోవటానికి ఇలా నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ డూప్ లెస్ బిల్డింగ్ లో రెండు విశాలమైన హాళ్లు,  20 గదులు నిర్మించారు. ఈ కోటను జానకీ బాయి మరింత లక్జరీగా ఏర్పాటు చేసుకున్నారు. భవన నిర్మాణంలో ప్రత్యేకతలు ఎన్నోఉన్నాయ్. ఏ కాలంలోనైనా భవనం చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది. గడిలో ద్వారాలు ఆటోమెటిక్ గా మూసుకుపోతాయ్. ఈ ద్వారాలను లండన్ నుంచి తెప్పించారని చరిత్ర. గడిలో ఎవరైనా ఆకస్మికంగా చొరబాటు చేస్తే తప్పించుకోవటానికి సిక్రేట్ మార్గం ఉండేదట. ఆ తర్వాత దోర వారసులు ఈ సంస్థానంలోని భూమిని పాఠశాల కోసం ఇచ్చారు. అయితే 119 ఏళ్ల తర్వాత కూడా సిర్నాపల్లి సంస్థానం చెక్కు చెదరకుండా ఉంది. నిజామాబాద్ జిల్లాను పాలించిన రాణి శీలం జానకీభాయి నివాసం ఉన్న ఈ సంస్థానంను పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు స్థానికులు.

టాప్ హెడ్ లైన్స్

Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget