అన్వేషించండి

Adilabad News: స్కూల్లో విషప్రయోగం, ప్రిన్సిపాల్ అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు

Telangana News | ఇచ్చోడ మండంలోని ధర్మపురిలో ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. గుర్తుతెలియని దుండగులు విద్యార్థులు నీళ్లు తాగే ట్యాంకులో పురుగుల మందు కలిపారు.

Poison mixed in Water Tank at Govt School in Dharmapuri in Adilabad District
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విష ప్రయోగం చేయడం కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు మంచినీళ్లు తాగే ట్యాంకులో విషం కలిపారు. మధ్యాహ్న భోజనం వండాల్సిన వంట సామాగ్రికి సైతం పురుగుల మందు పూశారు. విషయం గమనించిన ప్రిన్సిపాల్ అప్రమత్తం కావడంతో 30 మంది విద్యార్థులకు ముప్పు తప్పింది. 

అసలేం జరిగిందంటే..

ఇచ్చోడ మండలంలోని ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బా కనిపించడంతో ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తం అయ్యారు. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో స్కూల్ వంట గదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం స్కూ్ల్ ఉందని కిచెన్ తెరవగా పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమై పిల్లలను మంచి నీళ్లు తాగే ట్యాంకు, నల్లాల వైపు వెళ్లనివ్వలేదు. అదే విధంగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకున్నారు. 


Adilabad News: స్కూల్లో విషప్రయోగం, ప్రిన్సిపాల్ అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్

మధ్యాహ్న భోజనం చేసే పాత్రలలో సైతం దుండగులు విషం పూశారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూలు పిల్లలు చనిపోవాలని పరుగుల మందు ఎవరు కలిపారు, ఎవరికి ఈ అవసరం వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల దౌర్భాగ్యపు బుద్ధి వలన ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని.. వారిని గుర్తించి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

అసలే గత కొన్ని నెలలుగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో సరైన తిండి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం విమర్శలకు దారితీసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్ కు తరలించి చికిత్స చేయించినా ప్రాణాలు దక్కలేదు. పలు గురుకుల, సోషల్ వెల్ఫేర్, ఇతర ప్రభుత్వ స్కూల్ హాస్టల్స్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని కొన్ని రోజుల కిందట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget