అన్వేషించండి

Nizamabad News: వరితో ఉరే అంటే వేరుశనగ వేశాం- అది కూడా ప్రాణాలు తీస్తోందంటున్న రైతులు

వేరు శనగ రైతుకు మార్కెట్లో చేదు అనుభవం. గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్న రైతులు.వరి వద్దన్న సీఎం మాటలు విని పల్లి పంట సాగు చేశాం. క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.3,500 మాత్రమే ధర పలుకుతోందంటున్న రైతులు

నిజామాబాద్ జిల్లాలో వేరు శనగ రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కాదనుకుని పల్లి పంట వేస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. మార్కెట్లో పల్లీ పంటకు గిట్టుబాటు ధర కరవైంది. పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

వరి వేస్తే ఉరేనని సీఎం కేసీఆర్ అన్నమాటలతో మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి, మెట్పల్లి, గొట్టిముక్కల, మాణిక్ భండార్, ఢీకంపల్లి, కల్లెడి, మదనపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి తదితర గ్రామాల్లో రైతులు సుమారు 300 ఎకరాల్లో పల్లీ సాగు చేశారు. నూనె గింజల పంటలకు డిమాండ్ ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతు సదస్సుల్లో చెప్పడంతో ఈ వేరుశనగ సాగు కోసం రైతులు అంగీకరించారు.

తాము కొన్న విత్తనాలతో ఎకరానికి 6 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. తీరా సాగు చేసిన పల్లీ అమ్ముడుపోక రైతులు తల్లడిల్లుతున్నారు. ఆయిల్ మిల్లర్లు క్వింటాలు పల్లీకి 3వేల రూపాయల నుంచి 3500 రూపాయల వరకే చెల్లిస్తామన్నారని రైతులు వాపోతున్నారు.

గత్యంతరం లేని పరిస్థితిలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ తీసుకువెళ్తే వ్యాపారులు కొనుగోలు చేయడానికే ముందుకు రావడం లేదని అంటున్నారు పల్లీ రైతులు. అక్కడ కూడా మధ్యవర్తుల దందా పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు రైతులు. నిజామాబాద్‌కు చెందిన ఒకే ఒక ఆయిల్ మిల్ యజమాని ఉన్నాడని...  మధ్యవర్తుల ద్వారా అతి తక్కువ ధరకే అడిగారని చెబుతున్నారు. 3500 రూపాలకు అమ్మితే ఎకరానికి మరో 20వేల నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి పల్లి సాగు చేసి అవస్థలు పడుతున్నామని ఆందోళ చెందుతున్నారు రైతులు.

నిజామాబాద్ మార్కెట్లో పల్లి కొనుగోలు కేంద్రాలు లేవు. అందువల్లే ఆయిల్ మిల్లుల యజమానులు కుమ్మకై ధర తక్కువ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దళారీ వ్యవస్థను అరి కట్టాలంటే జిల్లాకు ఒక పల్లీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలని సూచిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా కనీసం పల్లీ క్వింటాలు 6వేల రూపాయల నుంచి 7వేల రూపాయల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే తమకు కొంతైనా లాభం ఉంటుందంటున్నారు రైతులు.

వరి వద్దనటంతో వేరుశనగ సాగు

కేసీఆర్ మాటలు నమ్మి వరి సాగును కాదని పల్లి పంటను సాగు చేశామనని.... అయితే పల్లి విత్తనాలకు ఎకరానికి 7వేల రూపాయలు ఖర్చు చేశామంటున్నారు రైతులు. అయితే దిగుబడి మాత్రం 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఇది తమకు తీవ్ర నష్టం మిగిల్చిందంటూ ఆవేదన చెందుతున్నారు రైతులు. పల్లి పంట సాగుకు ఎకరానికి 35 వేల రూపాయలు ఖర్చయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు పల్లి 3వేల రూపాయల నుంచి 3500 రూపాయల వరకు మాత్రమే అడుగుతున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు పల్లి రైతులు. కనీసం క్వింటాలు పల్లి ధర 6వేల రూపాయలకైనా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. లేదంటే తాము అప్పుల పాలు కావాల్సిందే అంటున్నారు అన్నదాతులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
Embed widget