అన్వేషించండి

Nizamabad News: బోధన్ అల్లర్ల కేసులో న్యూ ట్విస్ట్, అసలు సూత్రధారుల్లో టీఆర్‌ఎస్‌ లీడర్

బోధన్ అల్లర్ల కేసులో కీలక మలుపు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ భర్త కౌన్సిలర్ శరత్ రెడ్డి, శివసేన నాయకుడు గోపితో విగ్రహం కొనిపించినట్లు వెల్లడించిన పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

నిజామాబాద్ బోధన్‌లో శివాజీ విగ్రహం అల్ల‌ర్ల కేసు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. శివాజీ విగ్రహం వివాదంలో టిఆర్ఎస్ కౌన్సిలర్, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్సన్ భ‌ర్త శ‌ర‌త్ రెడ్డి చుట్టు ఉచ్చుబిగుసుకుంది. అల‌ర్ల‌ల‌కు కార‌ణ‌మైన శివాజి విగ్ర‌హం కేసులో శివ‌సేన గోపితోపాటు, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స్ తూము ప‌ద్మ భ‌ర్త, కౌన్సిల‌ర్ శ‌ర‌త్ రెడ్డి ఇరుక్కున్నారు.

శివసేన నాయకుడు గోపితో శ‌ర‌త్ రెడ్డి  విగ్ర‌హం కొనిపించిన‌ట్లు పోలీసులు నిర్దారించారు. విగ్ర‌హం కొని శ‌ర‌త్‌కి  చెందిన రైస్ మిల్లులో ఉంచారు. ఎవ‌రు లేని స‌మ‌యంలో తెచ్చి పెట్టాల‌ని ఇరువురు ముందుగా ప్లాన్ వేసుకున్నారని తెలిసింది. అప్పటికే శివసేన నాయకుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గోపి అసలు విషయం బైటపెట్టారు.

గోపి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపోలీసులు టీఆర్ఎస్ కౌన్సిలర్ శరత్ రెడ్డిపై 188,427, 153, 153A r/w 34 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గోట్ట‌డంతోపాటు, గోడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌నే సెక్ష‌న్ల‌ను యాడ్ చేశారు పోలీసులు. 

శరత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు శివాజీ విగ్రహం పెట్టించాలన్న ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది. ముందస్తుగా ఎవరికీ తెలుపకుండా శరత్ రెడ్డి ఎందుకు ఆసక్తి చూపారు అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్ వెనుక ఇంకెవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో కూడాల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఈ కుట్రలో ఉందని నిజామాబాద్  ముందే అనుమానించారు. శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్‌జిల్లాలోని బోధన చౌరాస్తాలో ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌లో కొందరు అభ్యర్థించారు. దీనిపై ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

శివాజీ విగ్రహ ప్రతిష్టపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా గోపీ అనే వ్యక్తి మాత్రం తొందర పడినట్టు చెప్పారు పోలీసకులు. శరత్‌ అనే కౌన్సిలర్ సహాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. వారం క్రితం గోపి, శరత్‌ కలిసి విగ్రహం ఏర్పాటుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. కావాలనే విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారని వివరించారు. ఇది పట్టణంలో అలజడికి కారణమైందంటున్నారు పోలీసులు. 

రాత్రికి రాత్రే పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లో ఎలాంటి పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఓ వర్గాం వ్యతిరేకించింది. అలాంటి విగ్రహం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం ఆందోళన బాట పట్టింది. దానికి వ్యతిరేకంగా బీజేపీ, శివసేన ఆందోళన బాటపట్టాయి. బీజేపీ, శివసేన కార్యకర్తలు, మైనార్టీ నాయకులు భారీగా అంబేడ్కర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఒక సమయంలో ఆగ్రహంతో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపుచేసుందుకు పోలీసులను భారీగా మోహరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget