By: ABP Desam | Updated at : 18 Jan 2023 10:24 AM (IST)
Edited By: jyothi
ఇంద్రవెల్లి ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
Nagoba Jathara 2023: నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు ప్రధాన ఘట్టాన్ని పూర్తి చేశారు. నాగోబా అభిషేకం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి హస్తలమడుగులో పవిత్ర జలాన్ని సేకరించి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా మెస్రం వంశీయులు పిల్లాపాపలతో ఎడ్లబండ్లపై తరలి వచ్చారు. ఇంద్రాదేవికి ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మెస్రం వంశ కుటుంబీకులు సహపంక్తి భోజనాలు చేసి డోలువాయిద్యాల నడుమ కేస్లాపూర్ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈనెల 21న ప్రారంభమయ్యే నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు ఏటా సాంప్రదాయ రీతిలో నిర్వహించే పూజల కోసం సిద్దమయ్యారు. నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు జనవరి 1న కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి 10వ తేదిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరిలో గల హస్తలమడుగు వద్ద పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈనెల 17న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. వారితో పాటు మెస్రం వంశ కుటుంబాలు వారం రోజుల పాటు కేస్లాపూర్ జాతరలో ఉండేందుకు అన్నివిధాల ఏర్పాట్లు చేసుకొని ఎడ్లబండ్లపై తరలివచ్చారు. ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవి ఆలయ సమీపంలో గల మర్రిచెట్టుపై పవిత్ర జలం తీసుకొచ్చిన కళిశం (ఝారీ) ని పెట్టారు. అనంతరం ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
పవిత్ర గంగాజలం కోసం తమ పాదయాత్ర సాఫిగా క్షేమంగా జరిగింది. ఇక్కడి నుంచి కేస్లాపూర్ కు క్షేమంగా చేరుకొని, సాంప్రదాయ ఆచార అన్ని కార్యక్రమాలు చేసి నాగోబా మహాపూజ చేయటానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని ఇంద్రాదేవికి మొక్కులు సమర్పించారు. డోలు వాయిద్యాలతో ఇంద్రా దేవికి ప్రత్యేక పూజలు చేసి.. మహిళలు తయారు చేసిన నైవేద్యం సమర్పించారు. కొంతమంది కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రాదేవి ఆలయ ప్రాంగణంలో రోజంతా బసచేసి మహిళలు ప్రత్యేక వంటకాలు చేశారు. సాంప్రదాయ రీతిలో మినప పప్పును రుబ్బి మరీ గారెలు తయారు చేశారు. స్వచ్చమైన నువ్వుల నూనెతోనే ఈ వంటకాలు చేయడం ఆనవాయితీగా వస్తోందని మెస్రం వంశ మహిళలు ఏబీపీతో తెలిపారు. మరికొందరు దంపుడు బియ్యంతో తీపి ప్రసాదం, గోదుమ పిండితో తియ్యటప్పాలు తయారు చేశారు.
ఇక్కడ వండిన ప్రతి వంటకాన్ని మహిళలు ముందుగా ఇంద్రాదేవికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. ఆపై అంతా కలిసి అంటే కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి ఉదయం పూట వచ్చిన మెస్రం వంశ కుటుంబీకులు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంకాలం వేళ కేస్లాపూర్ పయనమయ్యారు. పవిత్ర జల ఝారిని తీసుకొని మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై వచ్చిన వారిని ముందుగా సాగనంపి వారి వెంటనే వెనుక దిశగా బయలుదేరి కేస్లాపూర్ లోని మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మర్రిచెట్ల కింద నాలుగు రోజుల పాటు అక్కడే బస చేసి సాంప్రదాయ కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం పూట నాగోబా ఆలయానికి పవిత్రజల ఝారితో చేరుకొని అర్థరాత్రి పవిత్ర జలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ చేయనున్నారు. మహపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా మహాపూజ కోసం మెస్రం వంశ కుటుంబీకులు ఎడ్లబండ్లపై పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
Nizamabad News : కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం, బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణలు!
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం