అన్వేషించండి

24న నాగోబా జాతరకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి - విద్యా సంస్థలకు సెలవు

కేస్లాపూర్ లోని నాగోబా ఆలయానికి చేరుకొని నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటారు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి. ఆపై మెస్రం వంశీయులతో కలిసి జాతర విశేషాలు తెలుసుకుంటారు. 

Ministers Satyavathi Rathod and Allola Indrakaran Reddy to visit Nagoba Temple: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి బయలుదేరి నిర్మల్ జిల్లా మీదుగా 11గంటలకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు చేరుకుంటారు. కేస్లాపూర్ లోని నాగోబా ఆలయానికి చేరుకొని నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటారు. ఆపై మెస్రం వంశీయులతో కలిసి జాతర విశేషాలు తెలుసుకుంటారు. 

అనంతరం జాతరలో ఐటిడిఎ (ITDA) ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఆయా శాఖల స్టాల్స్ ను సందర్శిస్తారు. ఆపై ప్రతియేటా నిర్వహించే నాగోబా దర్బార్ లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లా (Nirmal District ) ఖానాపూర్ కు బయలుదేరి, అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. నాగోబా దర్బార్ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒ ఆద్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో పోలిస్ శాఖ ఆద్వర్యంలో ప్రత్యేక శిబిరం ఎర్పాటు చేసారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

నాగోబా జాతర.. నాగోబా దర్బార్ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈనెల 24న సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివాసీల అతిపెద్ద జాతరైన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరను మరియు రేపు జరిగే నాగోబా దర్బార్ ను పురస్కరించుకుని మంగళవారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సెలవును తిరిగి 11-02-2023న రెండవ శనివారం పని దినంగా ప్రకటించారు. 

నాగోబా దర్బార్ ను 1942లో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ప్రారంభించారు. ఆనాడు నిజాం పాలనలో జల్ జంగల్ జమీన్ కోసం కుమ్రం భీం నిజాం సైన్యంతో పోరాడి అమరుడుకాగా.. ఆదివాసీలపై అద్యయనం చేసేందుకు నిజాం.. ఆస్ట్రియా దేశానికి చెందిన మానవపరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ ను 1940లొ పంపించి ఆదివాసీలపై అద్యయనం చేయించారు. ఈ కాల వ్యవధిలోనే 1942లో  కేస్లాపూర్ లో జరిగే జాతరకు ఆదివాసీలు అధికంగా రావడంతో గమనించిన డార్ఫ్.. కేస్లాపూర్ లో దర్బార్ ను నెలకొల్పారు. అప్పటి నుండి నాగోబా జాతరలో దర్బార్ ను కొనసాగిస్తున్నారు. దర్బార్ లో ఆదివాసీల ఆర్జీలు స్వీకరిస్తు సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారు.


24న నాగోబా జాతరకు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి - విద్యా సంస్థలకు సెలవు 
ఈ ఆర్జీలలో అధికంగా ఆదివాసీలు పోడు భూములకు హక్కు పత్రాలు, త్రాగునీటి సౌకర్యం, వ్యవసాయ భూమి, త్రిఫేస్ కరెంటు, గ్రామానికి రోడ్డు, వంతెనలు, ట్రైకార్ లోన్స్, నివాస స్థలంతో పాటు ఇళ్ళ గురించి అందిస్తారు. ఇలా ఎన్నో ఏళ్ళుగా ఆదివాసీల సమస్యలు ఇంకా ములనపడే ఉన్నాయి. ఆదివాసీల సమస్యలపై ఆదివాసీలు పోరాడుతునే వస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Daily Puja Tips: పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
Embed widget