అన్వేషించండి

ఆదిలాబాద్ అడవుల్లో అలజడి- ఏజెన్సీ గ్రామాల్లో ఖాకీల నిఘా!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలు గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇంతకాలం ప్రశాంతంగానే ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలతో హైటెన్షన్ కనిపిస్తోంది. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా మీదుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే పక్కా సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ ఎస్పీలు ఉదయ్ కుమార్ రెడ్డి, కే.సురేష్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాలు యాక్ష షురూ చేశాయి. జిల్లా అడవుల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు లేఖలు విడుదల చేయడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతలోనే “మంగి - ఇంద్రవెల్లి” దళం పేరిట హెచ్చరిక లేఖలు సైతం విడుదలయ్యాయి. గతంలో పోలీసులకు దొరికినట్లే దొరికి.. తప్పించుకున్న మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు జిల్లా అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అడవులు దట్టంగా మారడంతో మావోయిస్టుల కదలికలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మాజీ మావోయిస్టులపై కూడా నిఘా..

మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు జిల్లా సరిహద్దు ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా కవ్వాల్ అటవీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంపై దృష్టి సారించారు. ఏజెన్సీ మండలాలైన, తిర్యాని, లింగాపూర్, జన్నారం, కడెం, పెంబి, దండెపల్లి, కెరమెరి, జైనూర్, సిర్పూర్‌యు, చింతలమానేపల్లి, వాంకిడి, సిరికొండ, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, బజారాత్నూర్‌లోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు.

ఇప్పటికే టీంలుగా విడిపోయిన ప్రత్యేక బలగాలు.. కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. మాజీల కదలికలపై నిఘా సారిస్తూనే... అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. రహస్య సమాచార వ్యవస్థను మరింతగా పటిష్టం చేసుకుంటున్నారు. అనుమానిత వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల సమాచారంతో ముందుకెళ్తున్నారు. మావోయిస్టు కదలికలపై పట్టున్న రిటైర్డ్ అధికారులను కూడా రంగంలోకి దింపి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వర్గీస్ పేరిట లేఖలు విడుదలవడంతో కలకలం..

జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేదని పలుమార్లు పోలీసులు ప్రకటించినప్పటికీ.. మళ్లీ మవోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కరోనా సమయంలోనే పెద్దఎత్తున రిక్రూట్మెంట్ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేరడిగొండ మండలానికి చెందిన ఓ గిరిజన యువకుడు పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించాడు. అప్పటి నుంచి కొంత సైలెంట్ గానే కనిపించినా.. మావోయిస్టుల కదలికలు ఇటీవల జరిగిన వారోత్సవాల సందర్భంగా వర్గీస్ పేరిట లేఖలు విడుదల కావడం కలకలం రేపింది. అనుకున్నట్లుగానే ఇంద్రవెల్లి మండల అడవుల్లో వారోత్సవ సభను నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టుల సంచారానికి జిల్లా అడవులు అనువుగా ఉండడంతో వారి కదలికలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ప్రజలెవరూ మావోలకు సహకరించవద్దు..

రాజకీయ పార్టీల నేతలు, ఇతర ముఖ్య అధికారులు మారుమూల ప్రాంతాల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అనవసరంగా ఇబ్బందుల్లో పడొద్దని చెబుతున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలతో మరింతగా మమేకమవుతూ పరిస్థితులను వివరిస్తున్నారు. అంతే కాకుండా స్థానిక ఏజెన్సీ గ్రామాల్లోని యువత మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితులు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దీనిలో భాగంగా గిరిజనులకు పోలీసుల పట్ల విశ్వాసం కలిగే విధంగా చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన పోలీసు యంత్రాంగం... అన్ని రకాల చర్యలు చేపడుతూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టే ప్రయత్నం ముమ్మరం చేస్తోంది.

సంఘ విద్రోహక శక్తులను జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేవని, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలతో సంతోషంగా ఉన్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయని, సంఘ విద్రోహక శక్తుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మారుమూల గ్రామాలలో కూడా పోలీసులకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉందని, మావోయిస్టులకు జిల్లా ప్రజలు ఎవరూ సహకరించవద్దని చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget