అన్వేషించండి

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Kanti Velugu scheme In Telangana: జనవరి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 

Telangana Kanti Velugu scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీ ఎం హెచ్ ఓ లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం సమీక్ష జరిపారు. జనవరి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 
ఇదివరకు నాలుగు సంవత్సరాల క్రితం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు కొనసాగించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి 100 పని దినాలలోనే పూర్తి చేసేలా సూక్ష్మస్థాయి ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. సెలవులను మినహాయిస్తే సుమారు ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయా జిల్లాల జనాభాను బట్టి కంటి వెలుగు శిబిరాల కోసం అవసరమైన బృందాలను పంపిస్తామని, ఇదివరకటితో పోలిస్తే ఈసారి అదనంగా 1500 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యం పూర్తి చేసుకునేలా కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాలని, ఎక్కడ కూడా అర్ధాంతరంగా ఈ శిబిరాలు నిలిచిపోకుండా బఫర్ టీమ్ లను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు.
ఏ రోజున ఏ వార్డులో, ఏ గ్రామ పంచాయతీ పరిధిలో శిబిరాలు నిర్వహించాలనే విషయమై ముందస్తుగానే పక్క ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని అన్నారు. సరైన ప్రణాళిక రూపకల్పన జరిగితే, కార్యక్రమం సాఫీగా కొనసాగేందుకు ఆస్కారం ఉంటుందని హితవు పలికారు. కంటివెలుగు శిబిరాల నిర్వహణ చేపట్టడానికి ముందే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖల అధికారులను సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రితో పాటు రీడింగ్ అద్దాలను ముందుగానే జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించిన రోజునే అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు అందజేయాలని సూచించారు. 
దూరదృష్టి ఉన్న వారి వివరాలను సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలని, పక్షం రోజుల్లోపు ఆ వివరాలకు అనుగుణంగా అవసరమైన కంటి అద్దాలను జిల్లాలకు పంపించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. శిబిరం నిర్వహించిన నెల రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర దృష్టి అద్దాల పంపిణి ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధ్యాన్యతను ఇస్తూ, రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిబిరాల విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు. 

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి :
జనవరి 18 నుండి చేపట్టనున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ పట్టణాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించేలా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. 
శిబిరాల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 70 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్టోమెట్రిస్ట్ అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏ.ఎన్.ఎం లు, ముగ్గురు ఆశా వర్కర్ల చొప్పున మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారని తెలిపారు. ఒక్కో బృందం గ్రామ పంచాయతీ పరిధిలో 118 మందికి, అర్బన్ పరిధిలో 110 మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికను అనుసరిస్తూ జిల్లాలో సుమారు 8 లక్షల పైచిలుకు మందికి కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శిబిరాల ప్రారంభానికి రెండు రోజుల ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శిబిరాల నిర్వహణకు అవసరమైన వేదికలను ఎంపిక చేసి నివేదిక పంపించాలని, శిబిరాల వద్ద తాగునీటి వసతి, టెంట్లు, షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత గడువు లోపు కంటి వెలుగు శిబిరాలను చేపట్టి విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget