By: ABP Desam | Updated at : 12 Feb 2022 12:29 PM (IST)
నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు
నిజామాబాద్ జిల్లాలో రిజిస్టేషన్ ఆఫీస్లో అక్రమాల బాగోతాలు బయటపడుతున్నాయి. జిల్లాలో భూఅక్రమ రిజిస్ర్టేషన్లపై ఉన్నతాధికారులు కన్నేశారు. నిబంధనలకు విరుద్దంగా భారీగా భూముల రిజిస్ట్రేషన్లకు పాల్పడిన ముగ్గురు సబ్ రిజిస్ర్టార్లపై వేటు వేశారు.
ప్రభుత్వ భూముల మార్కెట్ వాల్యూ పెంచేందుకు నిర్ణయించగా జనవరిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో అనుమతులు లేని భూములకు రిజిస్ర్టేషన్లు చేశారు కొందరు సబ్ రిజిస్ట్రార్లు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండికొట్టారు. శాఖాపరమైన దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ సతీష్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ సురేష్, బోధన్ సబ్ రిజిస్ట్రార్ రోహిత్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్ ఫణిందర్రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో భూముల మార్కెట్ వాల్యూ పెంచింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను నిర్ధారించి ఫిబ్రవరి 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి తెచ్చింది. రేట్లు పెరుగుతాయనే సమాచారం తెలవడంతో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ పరిధిలో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. కానీ వ్యవసాయ భూముల్లో నాలాకన్వర్షన్తోపాటు ఇతర అనుమతులు తీసుకోకుండా ప్లాట్లుగా చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు కొంతమంది ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా ఈ దుశ్చర్యలు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేశారు. లక్షల రూపాయలను ముడుపులుగా తీసుకుని ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి కొట్టారు.
ఈ భూముల రిజిస్ట్రేషన్లలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించి ముగ్గురిని సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో పనిచేసే ఉద్యోగులపైన గతంలో పలు ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ నాయకుల అండదండలతో ఎలాంటి చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సాహసించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జోన్లు మారినా మరో చోటికి బదిలీకా లేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికే గండి కొట్టే పని జరగడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఇంకా ఈ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. అన్ని డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు జిల్లా ఇన్ఛార్జి రిజిస్ట్రర్ ఫణిందర్రావు తెలిపారు. పెద్ద పెద్ద వెంచర్లు వేసిన రియల్టర్లకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయ్. సబ్ రిజిస్ట్రార్లకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తెలుస్తోంది.
ఈ బాగంతోపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. దీనిపై విచారణ అధికారిగా అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రాను నియమించినట్లు చెప్పారు. పట్టణ ప్రణాళిక అధికారులను విచారణ సిబ్బందిగా నియమించారు.
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
ఎప్పుడైనా ఎన్నికలు, సిద్ధంగా ఉండాలి- నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ కీలక ప్రకటన
Nizamabad KTR Convoy: మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
TS News Developments Today: కేటీఆర్ నిజామాబాద్ పర్యటన, వరంగల్లో వీరయ్య- తెలంగాణ హైలెట్స్ ఇవే!
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్