అన్వేషించండి

Telangana: కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే, రాజకీయ సన్యాసం చేస్తా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

Telangana News: రేవంత్ రెడ్డి ఇంకా యువనేతలా మాట్లాడుతున్నారని, ఆయన బలహీనమైన ముఖ్యమంత్రి అని BJP ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు.

I will resign if congress won 14 loksabha seats says Nirmal BJP Alleti Maheshwar Reddy- రేవంత్ రెడ్డికి జులైలో ఓటుకు నోటు కేసులో సంక్షోభం తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎల్లో పార్టీ నుండి వచ్చాడు కాబట్టి ఆగస్ట్ సంక్షోభం ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా, ముఖ్యమంత్రి తరహాలో కాకుండా కాచుకో, తేల్చుకో.. నీ బలం ఏంటి, నీ వెంట ఎంత మంది ఉన్నారంటూ యువ నేతలా మాట్లాడుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రి 
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ‘సీఎం రేవంత్ రెడ్డి ఏం  మాట్లాడినా అభద్రతా భావంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయన మాటల్లో పసలేకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ బలహీనమైన ముఖ్యమంత్రిగా మాకు కనిపిస్తున్నారు. నీ స్థాయికి మించి ప్రధాని నరేంద్ర మోదీని విమర్శంచడం సరికాదు. ముందు జులైలో వచ్చే ఓటుకు నోటు కేసు సమస్యను ఎదుర్కోవాలి. గతంలో నీ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మేం చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి. తెలంగాణలో వచ్చిన కొత్త ట్యాక్స్ పై త్వరలోనే మాట్లాడతాం’ అన్నారు.

చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తా !
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 14 సీట్లు గెలిస్తే తాను చెప్పినట్లుగానే రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాయ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని, కానీ ఇంకా అబద్ధాలు చెబుతూ వారిని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరికలు 
బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాషాయ పార్టీలో చేరారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ పట్టణ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్ , అదుముల్ల రమా పద్మాకర్, ఏడిపెల్లి నరేందర్, మాజీ కౌన్సిలర్ పోడెల్లి గణేష్, తాజా మాజి సర్పంచ్ లు, సోన్ ఎంపీటీసీ దాసరి శ్రీనివాస్, కడ్తాల్ సర్పంచ్ బర్మ నర్సయ్య , బొరిగం సర్పంచ్ రాజారెడ్డి, BRS పార్టీ గ్రామ అధ్యక్షులు శానం గంగాధర్, ఎంపీటీసీ లు,పలువురు మండల నాయకులు శనివారం నాడు (ఏప్రిల్ 20న) బీజేపీలో చేరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget