అన్వేషించండి

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో వర్షం మిగిల్చిన నష్టం- పంట మునగతో ఆందోళనలో రైతులు

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాను ముంచేసిన వర్షం. వేలాది ఎకరాల్లో పంటల్లో నష్టం. ఇంకా నీటిలో పంటలు. తీరని నష్టాన్ని చూసి బోరుమంటున్న అన్నదాత..

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ రైతులకు కష్టకాలంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వారం రోజులుగా పంటలు నీటిలోనే మురుగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. వరి, సోయా, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వరదల ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోయి మరో పంట సాగుచేసే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

రికార్డుస్థాయిలో వర్షం

జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా జులై మొదటి, 2వ వారంలోనే అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గోదావరి, మంజీరా పొంగడంతో నందిపేట, నవీపేట, రేంజల్‌, బోధన్‌ మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జిల్లాలో దాదాపు 59వేల 591 ఎకరాలకుపైగా పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు. ఇంకా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరినాట్లు వేసిన తర్వాతనే పంట నీట మునగడంతో వేసిన వరినారు మురిగిపోయి పంట దెబ్బతింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 40వేల 811 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. 14006 ఎకరాల్లో సోయా పంటకు నష్టం జరిగింది. వీటితోపాటు 4,233 ఎకరాలకుపైగా మొక్కజొన్నకు నష్టం జరిగింది. పత్తి 292 ఎకరాల్లో పంట నష్టం జరిగనట్టు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 25 వేల 869 రైతులకు చెందిన పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. వేలాది ఎకరాల్లో నీళ్లు నిలిచి ఉండడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయ్. ఇది రైతులకు మోయలేని భారంగా మారింది. 

ఎలా బయటపడేది?

రైతులు పంటలు వేసేందుకు దున్నుడు, నాట్లు, ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 వేల నుంచి 20వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఎకరాకు ఇతర పంటలకు రూ. 20వేల వరకు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా పడడంతో పంటలు వేసిన ప్రతీ రైతుపై అధిక భారం పడింది. వేసిన పంటలు దెబ్బతినడం, మళ్లీ వేసే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల భారీగా నష్టపోవడంతోపాటు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బయటపడే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. ఈ వర్షాల వల్ల 470 ఇళ్లు పాక్షికంగా,13 ఇళ్లు పూర్తిగా నేల మట్టమయ్యాయ్. 19 గ్రామాల్లో వరద ప్రమాదం. 862 మంది నిరాశ్రయులయ్యారు. 16 చోట్ల నీటి కాలువలకు గండిపడింది.  జిల్లాలో 27 రోడ్లు కోతకు గురయ్యాయ్. 89 విద్యుత్ స్థంబాలు నేలమట్టమయ్యాయ్.

ప్రభుత్వానికి నివేదిక

జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి పడుతుండడంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలో 1067 చెరువులు ఉండగా వందశాతం చెరువులు నిండిపోయాయి. అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. ఈ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల చెరువులకు గండిపడింది. జిల్లాలో 32 చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేనివిధంగా జిల్లాలో మొత్తం వర్షాకాలంలో పడే 75 శాతం వర్షం ఈ వారం రోజులోనే పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 287.9 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 752.9 మి.మీల వర్షం పడింది. జిల్లాలో వర్షాకాలంలో ప్రతీ సంవత్సరం సగటున 1042.4 మి.మీల వర్షం పడుతుంది. జిల్లాలో గురువారం భీంగల్‌ మండలంలో అత్యధికంగా 203.3 మి.మీల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 71.5 మి.మీల నుంచి ఆపైనే పడింది. సగటు వర్షపాతం 124.1 మి.మీటర్లుగా నమోదైంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget