అన్వేషించండి

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో వర్షం మిగిల్చిన నష్టం- పంట మునగతో ఆందోళనలో రైతులు

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాను ముంచేసిన వర్షం. వేలాది ఎకరాల్లో పంటల్లో నష్టం. ఇంకా నీటిలో పంటలు. తీరని నష్టాన్ని చూసి బోరుమంటున్న అన్నదాత..

Nizamabad Rains: నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ రైతులకు కష్టకాలంగా మారింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వారం రోజులుగా పంటలు నీటిలోనే మురుగుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. వరి, సోయా, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు వరదల ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోయి మరో పంట సాగుచేసే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

రికార్డుస్థాయిలో వర్షం

జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా జులై మొదటి, 2వ వారంలోనే అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గోదావరి, మంజీరా పొంగడంతో నందిపేట, నవీపేట, రేంజల్‌, బోధన్‌ మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జిల్లాలో దాదాపు 59వేల 591 ఎకరాలకుపైగా పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు. ఇంకా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరినాట్లు వేసిన తర్వాతనే పంట నీట మునగడంతో వేసిన వరినారు మురిగిపోయి పంట దెబ్బతింది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 40వేల 811 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. 14006 ఎకరాల్లో సోయా పంటకు నష్టం జరిగింది. వీటితోపాటు 4,233 ఎకరాలకుపైగా మొక్కజొన్నకు నష్టం జరిగింది. పత్తి 292 ఎకరాల్లో పంట నష్టం జరిగనట్టు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మొత్తం 25 వేల 869 రైతులకు చెందిన పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. వేలాది ఎకరాల్లో నీళ్లు నిలిచి ఉండడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయ్. ఇది రైతులకు మోయలేని భారంగా మారింది. 

ఎలా బయటపడేది?

రైతులు పంటలు వేసేందుకు దున్నుడు, నాట్లు, ఎరువులు, విత్తనాల కోసం సుమారు 15 వేల నుంచి 20వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఎకరాకు ఇతర పంటలకు రూ. 20వేల వరకు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా పడడంతో పంటలు వేసిన ప్రతీ రైతుపై అధిక భారం పడింది. వేసిన పంటలు దెబ్బతినడం, మళ్లీ వేసే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల భారీగా నష్టపోవడంతోపాటు ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బయటపడే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. ఈ వర్షాల వల్ల 470 ఇళ్లు పాక్షికంగా,13 ఇళ్లు పూర్తిగా నేల మట్టమయ్యాయ్. 19 గ్రామాల్లో వరద ప్రమాదం. 862 మంది నిరాశ్రయులయ్యారు. 16 చోట్ల నీటి కాలువలకు గండిపడింది.  జిల్లాలో 27 రోడ్లు కోతకు గురయ్యాయ్. 89 విద్యుత్ స్థంబాలు నేలమట్టమయ్యాయ్.

ప్రభుత్వానికి నివేదిక

జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి పడుతుండడంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలో 1067 చెరువులు ఉండగా వందశాతం చెరువులు నిండిపోయాయి. అన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. ఈ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల చెరువులకు గండిపడింది. జిల్లాలో 32 చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లాలో వరుసగా వారం రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేనివిధంగా జిల్లాలో మొత్తం వర్షాకాలంలో పడే 75 శాతం వర్షం ఈ వారం రోజులోనే పడింది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 287.9 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 752.9 మి.మీల వర్షం పడింది. జిల్లాలో వర్షాకాలంలో ప్రతీ సంవత్సరం సగటున 1042.4 మి.మీల వర్షం పడుతుంది. జిల్లాలో గురువారం భీంగల్‌ మండలంలో అత్యధికంగా 203.3 మి.మీల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 71.5 మి.మీల నుంచి ఆపైనే పడింది. సగటు వర్షపాతం 124.1 మి.మీటర్లుగా నమోదైంది.

టాప్ హెడ్ లైన్స్

Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Gift A Smile KTR Birthday: కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్ ఏ స్మైల్ - వినూత్నంగా పేద రైతులకు ఇన్సూరెన్స్ చేయించిన ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేత
Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget