By: ABP Desam | Updated at : 12 Apr 2023 04:35 PM (IST)
Edited By: jyothi
పార్టీని వీడాలంటే నిమిషం పట్టదు , నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి? ( Image Source : Alleti Maheshwar Reddy Facebook )
Eleti Maheshwar Reddy: ఏఐసీసీ నేతకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించారు. తాను పార్టీని వీడాలంటే ఒక్క నిమిషం పట్టదని.. కానీ తనకు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను కూడా తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బాధ పడలేదని అన్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో, టీవీల్లో వార్తలు వస్తే తనపై షోకాజ్ ఇస్తారా అని ప్రశ్నించారు.
నావల్లే ఇబ్బందులు అంటే చెప్పండి, పార్టీని వీడతాను ?
తన వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండని, పార్టీ నుంచి వెళ్లిపోతానని అన్నారు. పార్టీలు మారే వారు తనపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి. మచ్చ లేని మనిషిని, ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారన్నారు. నా మీద కోపం ఉంటే చెప్పండి కానీ ఇలా అవమానిస్తారా అని ప్రశ్నించారు. తన మీద పగ పట్టారని.. తనను పార్టీ నుండి పంపించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పార్టీ మీద పట్టుకోసం పార్టీనే కబ్జా చేస్తామంటే మీ ఇష్టం అని అన్నారు.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో నిన్ననే మాట్లాడానని ఎలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ లో గ్రూపులు సహజం అని, బీజేపీ నాయకుల్ని నేరుగా కలిసిన వారికి ఎలాంటి నోటీసులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. అలాగే తనకు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని అడిగారు.
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నరు: ఎంపీ అర్వింద్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఊహించని గెస్ట్!