అన్వేషించండి

Nizamabad News: మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైనింగ్‌పై రగడ- ఉద్యమానికి సిద్ధమవుతున్న నిర్వాసితులు

మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్ పై రగడ.1.5 టీఎంసీల రిజర్వాయర్ ను 3.5 టీఎంసీలకు పెంచటంపై ఆందోళన. సేవ్ మంచిప్ప పేరుతో మంచిప్ప గ్రామస్తుల ఆందోళన. రీడిజైన్ వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణంపై రగడ మొదలైంది. 21 ప్యాకేజీ కింద మంచిప్స రిజర్వాయర్ 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రభుత్వం తొలుత రూపకల్పన చేసింది. కానీ 3.5 టీఎంసీతో రీడిజైన్ చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామం కొండెం చెరువుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశే 2007లో ప్రాణహిత చేవెళ్ల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20, 21, 22 ప్యాకేజీలను చేపట్టారు. సొరంగ మార్గం పనులను పూర్తి చేశారు. ఏస్సారెస్ఫేబ్యాక్ వాటర్‌పై ఆధారపడి నిర్మించిన ఈ ప్యాకేజీల ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్లాన్ వేశారు. మొదట 1.5 టీఎంసీల కెపాసిటీతో మంచిప్ప రిజర్వాయర్ రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద విలీనం చేశారు. కాల్వల ద్వారా కాకుండా 20, 21 ప్యాకేజీల సాగు నీరు అందించేలా పైప్ లైన్ ద్వారా సాగు నీరు నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంచిప్పకొండెం చెరువును 3.5 టీఎంసీల నీటిని నిల్వచేసే రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. దీని ద్వారా బాల్కొండ ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలకు ఎస్కారెన్సీ నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రీ డిజైన్ పై మంచి సహా 9 గ్రామాల అభ్యంతరం

మంచిప్ప రీ డిజైన్ ద్వారా 10 గ్రామాలు నీటమునగనున్నాయని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట 1.5 టీఎంసీల నిల్వ సామర్ధ్యం గల రిజర్వాయర్  నిర్మిస్తామని చెప్పి ప్రస్తుతం 3.5 టీఎంసీల నిల్వ పేరుతో రీడిజైన్ అంటూ అన్యాయం చేస్తున్నారని రిజర్వాయర్ వల్ల ముంపు గ్రామా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే 150 ఎకరాల భూమిని కేవలం రూ. 4 లక్షల నష్టపరిహారానికే ఇచ్చేశామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం. రూ.50 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది.

ప్రస్తుతం రిజర్వాయర్ 3.5 టీఎంసీలకు పెంచి రీడిజైన్ చేశారు. దీంతో అమ్రాబాద్, భూసేకరణ చేపట్టాల్సిన గ్రామాల్లో 1336 ఎకరాలు ఉంది. మరో 788 ఎకరాల అటవీ భూమి కోసం ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. భూసేకరణకు వెళ్లిన అధికారులను రైతులు పలుమార్లు వెనక్కి పంపారు. 1.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో లక్షా 83 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. అయితే రీ డిజైన్ ద్వారా 3.5 టీెఎంసీల నీటి నిల్వతో పెద్దగా ఒరిగే ప్రయోజనం లేదంటున్నారు ముంపు గ్రామస్థులు. కేవలం రీ డిజైనింగ్ ద్వారా 1000 ఎకరాలకు మాత్రమే అదనంగా సాగు నీరందనుందని చెబుతున్నారు ముంపు గ్రామస్తులు. ఇది కేవలం కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల కమీషన్ల కోసమే రీ డిజైనింగ్ తెరమీదకు తెచ్చారని వాపోతున్నారు. ఈ రీడిజైనింగ్ ద్వారా 10 గ్రామాలు నీట మునగనున్నాయ్. గాంధారీ, కామారెడ్డి హైవే వెళ్లే రహదారులు మూసుకుపోతాయ్. అటవీ సంపదన నష్టపోతుంది. గిరిజనులు అటవీపై ఆధారపడి జీవిస్తున్నారు. వారు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. దాదాపు 10,000 మందీ రోడ్డున పడతారని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికే మల్లన్న సాగర్ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ నిర్వాసితులకు కల్పించిన వసతులను చూసి మరింత ఆందోళనకు గురవుతున్నారు. వారికి చిన్న చిన్న ఇళ్లు ఇచ్చారని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులు ఇప్పటికీ కష్టాలు ఎదుర్కోంటున్నారని మంచిప్ప రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డీవీఆర్ ప్రజల ముందు పెట్టాలి

1.5 రిజర్వాయర్ డీపీఆర్ ఇంకా రాలేదని 3.5 రీ డిజైన్ డీపీఆర్ సైతం చూపెట్టలేదని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. రిజర్వాయర్ డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలి. లేదంటే నిర్మాణ పనులను అడ్డుకుంటామని ముంపు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ముంపు గ్రామాల్లో అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాలతోపాటు మరో 7 గిరిజన తండాలు కనుమరుగుకానున్నాయి. ఏ మేరకు భూములు కోల్పోతారో రైతులకు చెప్పకుండా అధికారులు. పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ముంపు బాధితులు కమిటీగా ఏర్పడి. సేవ్ మంచిప్ప పేరుతో దశల వారీ ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. మంచిప్ప రిజర్వాయర్ వల్ల ముంపు గ్రామాల యువకులకు పిల్లలను ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మంచిప్పలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడమే కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే మంచిప్ప గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని. రెండు పంటలు పండుతాయి. అలాంటిది ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేకున్నా ఎందుకు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూంల నిర్మాణం కూడా చేపట్టలేదు. రీ డిజైన్ పేరుతో మమ్మల్ని ఎక్కడికి పంపుతారని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రీ డిజైన్ పేరుతో కొందరి లాభం కోసం 10 వేల మందిని రోడ్డున పడేయాలని చూస్తున్నారని ముంపు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రీ డిజైన్ ను వెనక్కి తీసుకునేంత వరకూ సేవ్ మంచిప్ప పేరుతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget