అన్వేషించండి

Nizamabad News: అకాల వర్షంతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం- క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలని రేవంత్ డిమాండ్

అకాల వర్షంతో రాష్ట్రంలో 5లక్షల ఎకరాల్లో పంట నష్టం. మామిడి, మొక్కజొన్న,ఇతర పంటలు. దెబ్బతిన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం అందించాలి. కాంగ్రెస్ హయాంలో నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంది

అకాల వర్షంతో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు అకాల వర్షానికి బాగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కామారెడ్డి జిల్లా పాదయాత్రలో భాగంగా అంకోల్ గ్రామంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. సహకార కేంద్ర బ్యాంకులో రుణాలు తీసుకున్నాం తమను బ్యాంకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని  రైతులు రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డబ్బులు లేకుంటే ఇంట్లోంచి ల్యాప్ టాప్ తీసుకెళ్లారని ఓ రైతు బాధను రేవంత్ రెడ్డికి తెలిపాడు. రాష్ట్రంలో నష్టపోయిన పంటల నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పనిముట్లకు సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎకరాకు 40వేల వరకు సాయం అందించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులపట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నీరుగార్చిందన్నారు. ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు కావడంలేదన్నారు. దీంతో ఇలాంటి సమయంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

2021లో బాన్సువాడ నియోజకవర్గంలో ఒకే మండలంలో 8 వేల ఎకరాల పంట నష్టం జరిగింది. 15 నెలలుగా రైతులకు పరిహారం అందించలేదు. వరి పంటకు ఒక బస్తాకు 5 కిలోలు తరుగు తీస్తూ రైతులను నిండా దోచుకుంటున్నారని విమర్శించారు. పోచారం కొడుకులు అచ్చొసిన ఆంబోతుల్లా ఊరుమీద పడి తిరుగుతున్నారు. కేసీఆర్ సావాస దోషంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా మారిపోయారని అన్నారు రేవంత్ రెడ్డి. పోచారం తన ఇంటి పేరు పైసల శ్రీనివాస్ గా మార్చుకున్నారని ఆరోపించారు రేవంత్. తండ్రీ కొడుకులు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని..... తక్షణమే ప్రభుత్వం ఎకరాకు రూ.15వేలు పంట నష్టం వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారు. పంట నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని ప్రశ్నించారు రేవంత్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి. 2021 లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు బీమా కాదు.. పంట బీమా పథకం కేసీఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. రైతు చనిపోతేనే డబ్బులు ఇస్తానంటున్న కేసీఆర్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే ఆరోపించారు రేవంత్ రెడ్డి. తక్షమే రాష్ట్రంలో పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు రేవంత్ రెడ్డి. 

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ

వీడియోలు

Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget