అన్వేషించండి

Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను ముంచిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పెట్టిన జవాదే క్రిష్ణాతో ఫొటోలు దిగిన నేతలు ఇబ్బంది పడుతున్నారు. సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.  

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పేరిట జవాదే (జాదవ్) క్రిష్ణా చేసిన మోసంపై బాధితులు ఓవైపు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులను ఏర్పాటు చేసిన క్రిష్ణా ప్రముఖులు ఫొటోలు దిగాడు. అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర రాజకీయ నాయకులతో కలిసి కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేశాడు. శాలువాలతో సన్మానాలు చేశాడు. ఈ ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు

ఉట్నూరులో ఖానాపూర్ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన వెడ్మ ఫౌండేషన్ ఆఫీసు పక్కనే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసు ఏర్పాటు ఉండటంతో గందరగోళం చోటుచేసుకుంది. క్రిష్ణా ఖానాపూర్ ఎమ్మెల్యే మిత్రుడు అంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడే వీడియోలు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీల కార్యకర్తలు సైతం క్రిష్ణాతో ఆయా పార్టీల నేతలు దిగిన ఫోటోలు వీడియోలను ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వైరల్ చేస్తున్నారు. 


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు

డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థకు వెడ్మ ఫౌండేషన్ కు సంబంధం లేదని పోలీసులను ఆశ్రయించారు ఆ సంస్థ సిబ్బంది. ఖానాపూర్ ఎమ్మెల్యే, వెడ్మ ఫౌండేషన్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల పోలీస్ స్టేషన్లలో వేడ్మ ఫౌండేషన్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు

డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మోసం వ్యహారంలో అనవసరంగా కొందరు పని గట్టుకొని ఖానాపూర్ ఎమ్మెల్యేను, వెడ్మ ఫౌండేషన్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రెయిసెంటర్ ఆదివాసీ నాయకులు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. "మైక్రోఫైనాన్స్ చైర్మన్ క్రిష్ణాకు, వెద్మ ఫౌండేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా ఎమ్మెల్యే, వెడ్మ ఫౌండేషన్ పేరును అప్రతిష్టపాలు చేస్తు సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారికి తగిన బుద్ధి చెబుతాం. మైక్రోఫైనాన్స్ చైర్మన్ కృష్ణతో మిత్రుత్వం ఉన్న మాత్రాన ఆయన చేసే చట్ట వ్యతిరేక పనులకు ఎలాంటి మద్దతు ఉండదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మైక్రోఫైనాన్స్ చైర్మన్ కృష్ణను నాలుగు నెలల క్రితమే ఎమ్మెల్యే పక్కన పెట్టారు, ఆయనను క్యాంప్ ఆఫీస్ వద్దకు రావద్దని హెచ్చరించారు. ఆయన జన్మదిన వేడుక సభ తర్వాత నుంచి అయనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధాలు లేవు.డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వెళ్లి కారక్రమాల్లో పాల్గొన్నరు. కానీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. కృష్ణ వ్యవహార శైలిలో వచ్చిన మార్పును గమనించి అతన్ని పక్కన పెట్టారు. అంతే కానీ కొందరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలనీ, అనవసర నిందలు మోపితే సహించేది లేదు" అని అన్నారు.  


Adilabad Crime News: ఆదిలాబాద్‌ జిల్లా నాయకుల మెడకు డిజిటల్ మైక్రో ఫైనాన్స్ మెసాల ఉచ్చు- క్రిష్ణాతో ఫొటోలు దిగిన నాయకులపై ఆరోపణలు

నిరుద్యోగులను మోసం చేసిన క్రిష్ణా ను అరెస్ట్ చేయాలి: బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ఆశలు చూపి ఉద్యోగాలు ఇస్తామని కోట్ల రూపాయలు దండుకొని పరారైన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఛైర్మన్ క్రిష్ణాను వెంటనే అరెస్టు చేయాలని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.ఉట్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..." జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూరు, జైనూర్‌లో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మేనేజర్లు, డైరెక్టర్లు, క్లర్కులు లాంటి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. కొంతమంది ఉద్యోగుల నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన క్రిష్ణాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయక గిరిజన నిరుద్యోగులను మోసం చేయడానికి వలసవాదులు వస్తున్నారు. సేవ పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారు. వారిపట్ల పోలీస్ అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలి. మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు ఊరికే వస్తాయని ప్రజలు భ్రమ పడవద్దు. నాలుగు కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడి  పరారైన క్రిష్ణా పై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget