అన్వేషించండి

Minister Prashanth Reddy : ఖమ్మం బీఆర్ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Minister Prashanth Reddy : బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అని బండి సంజయ్ చేసిన విమర్శలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Minister Prashanth Reddy : ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన ఆదరణ చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మతి భ్రమించిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఏదో ఒక విమర్శ చేయాలని తప్పా ఆయన మాటల్లో అర్థం పర్థం లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించడమే బండి సంజయ్ పనిగా పెట్టుకున్నారన్నారు. ఇరుకు గల్లీలో పెట్టుకునే ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం బండి సంజయ్ కేంద్రం నుంచి ఏం తెచ్చారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, ఏం చేయబోతున్నారో ఇవి చెప్పుకోవాలని హితవు పలికారు. మతి భ్రమించి అర్థరం పర్థం లేని మాటలు మాట్లాడవద్దని మంత్రి వేముల సూచించారు.  ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ చూడలేదన్నారని తెలిపారు. తన కంటికి ఎంత దూరం కనిపిస్తుందో అంతదూరం కంటే ఎక్కువే జనాలు ఉన్నారని చెప్పారన్నారు.  బండి సంజయ్ కు అది కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ సభ ఎక్కడ జరిగినా ఇలాగే  ఉంటుందన్నారు. రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 

4 కోట్ల మందికి కంటి పరీక్షలు 

అంతకు ముందు నిజామాబాద్ నగరంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఇది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమo అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం అంటే ఎక్కడో ఉండదని ప్రజల సంక్షేమమే నిజమైన రాజకీయం అని ఇందులోంచి పుట్టినవే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు మంత్రి. కంటి వెలుగును ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఇది సీఎం కేసీఆర్ పనితనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ కోసం ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిండు మనసుతో దీవించారని ఇప్పుడు.... దేశవ్యాప్తంగా తెలంగాణ వంటి పథకాలు అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

100 రోజుల పాటు 

 నివారించదగ్గ కంటి సమస్యలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని  ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు క్యాంపుల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం 100 రోజులపాటు కొనసాగుతుందని అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్లజోడు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget