అన్వేషించండి

Nandamuri Suhasini : రేవంత్ , దీపాదాస్ మున్షిని కలిసిన నందమూరి సుహాసిని - పార్టీ మారుతున్నారా ?

Telangana News : నందమూరి సుహాసిని రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. మర్యాదపూర్వక భేటీనా.. రాజకీయ ఎజెండా ఉందా అన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.


Nandamuri Suhasini had a meeting with Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు.  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు సాగుతోంది. వివిధ పార్టీల నేతల్ని.. కాంగ్రెస్ నేతలు ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బారీ విజయమే లక్ష్యంగా నేతల్ని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాసినితోనూ చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. మర్యాదపూర్వక భేటీ అయితే.. దీపాదాస్ మున్షితో పాటు మల్కాజిగిరి సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ సమావేశానిగి హాజరవ్వాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.                                

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది.కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దీంతో టీడీపీ నేతలంతా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో నందమూరి  సుహానికి కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరినా  చేరకపోయినా.. ఈ సమావేశం ద్వారా  టీడీపీ సానుభూతి పరుల మద్దతు కాంగ్రెస్ కు లభించేలా చేసుకోచ్చని భావిస్తున్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబ్టటి.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అయ్యే అవకాశం ఉంది. పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో సుహాసిని...  కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ ఆసక్తికరంగా  మారింది.                                           

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సమీప భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్న తర్వాత పూర్తి స్తబ్దుగా అయిపోయారు.  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇతర నేతలంతా సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో నూ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. పార్టీ అధ్యక్షుడ్ని కూడా ఇంకా నియమించలేదు.  ఈ క్రమంలో  టీడీపీ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.                           
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Upcoming Smartphones in 2026: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Apple: ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లను నిలిపివేసిన యాపిల్ - 2025లో క్రేజీ ఐఫోన్ మోడల్స్‌ను ఎందుకు ఆపేశారో తెలుసా?
ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లను నిలిపివేసిన యాపిల్ - 2025లో క్రేజీ ఐఫోన్ మోడల్స్‌ను ఎందుకు ఆపేశారో తెలుసా?
UP man kills wife: భార్య దగ్గర సీక్రెట్ ఫోన్ దొరికిందని చంపేసి ఇంటి వెనుక పాతిపెట్టేశాడు - చివరికి ఇలా దొరికిపోయాడు !
భార్య దగ్గర సీక్రెట్ ఫోన్ దొరికిందని చంపేసి ఇంటి వెనుక పాతిపెట్టేశాడు - చివరికి ఇలా దొరికిపోయాడు !
Embed widget