అన్వేషించండి

KCR Performs Pooja: భద్రాచలం చేరుకున్న కేసీఆర్, గోదావరి నదికి శాంతి పూజలు చేసిన సీఎం

KCR Performs pooja At Bhadrachalam: తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి శాంతి పూజలు నిర్వహించారు.ర

KCR performs pooja At Bhadrachalam: గోదావరి నది వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చేరుకున్నారు. వరద ప్రవాహం తగ్గాలని, ఇకనైనా శాంతించవమ్మా అంటూ గోదావరికి ప్రత్యేక శాంతి పూజలు నిర్వహించారు కేసీఆర్. పర్యటనలో తన వెంట ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి బ్రిడ్జిని సైతం కేసీఆర్ పరిశీలించారు. గోదావరి ప్రవాహాన్ని వంతెన పైనుంచి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, పువ్వాడ అజ‌య్ కుమార్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కరకట్ట పరిశీలనకు సీఎం కేసీఆర్..
వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కరకట్ట వద్ద నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. వారికి అధికారుల నుంచి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీస్తారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుంటారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

అంతకుముందు నేడు భద్రాచలం పర్యటనకు సీఎం కేసీఆర్ వర్షంలోనే బయలుదేరారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం మరి కాసేపట్లో  భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

వర్షం కురుస్తున్నా పర్యటనలో ముందుకు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగుర రాష్ట్రాల నుంచి వరదతో గోదావరి ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల కారణంగా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. కానీ వర్షం కారణంగా రోడ్డు మార్గంలోనే వరద ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ సర్వేలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పాల్గొననున్నారు. 

పినపాకలో గవర్నర్ తమిళిసై పర్యటన..
పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు. జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. నేటి ఉదయం నుంచి గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శిస్తున్నారు. సహాయ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget