అన్వేషించండి

Politics: ట్రెండ్‌ మార్చిన నేతలు - పెళ్లైనా, చావైనా సరే వదిలేదేలే - కొందరికి ఆనందం, మరికొందరికి దిక్కు తోచదు !

ఇంటికి పెద్ద నాయకుడైనా.. ఎమ్మెల్యే అయినా వస్తే ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో వారి క్రేజ్‌ మామూలుగా ఉండదు. కానీ దానివల్ల కొందరికి సంతోషమైతే, మరికొందరిని బాధకు గురిచేస్తున్నాయి

ఒక్కప్పుడు ఎవరి ఇంట్లోనైనా శుభాకార్యం జరిగి ఆ ఇంటికి పెద్ద నాయకుడైనా.. ఎమ్మెల్యే అయినా వస్తే ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో వారి క్రేజ్‌ మామూలుగా ఉండదు. వారి రాకే పెద్ద బహుమతిగా ఫీలయ్యేవారు. అయితే ఇప్పుడు నాయకులు మాత్రం ట్రెండ్‌ మార్చారు. శుభకార్యం కానీ.. మరోకార్యమైనా కానీ ఏది వదలడం లేదు. అటెండెన్స్‌ తమకు ఇంపార్టెన్స్‌ అన్న రేంజ్‌లోకి వెళ్లిపోయారు. వీరి రాక ఏమో కానీ జనం మాత్రం ఈ పొలిటికల్‌ అటెండెన్స్‌లకు షాక్‌లు కొట్టినట్లు ఫీలవుతున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులు కనిపించడమనేది ఒకప్పటి ట్రెండ్‌ అయితే అలా ఉన్న వారిని తరువాత ఎన్నికల్లో లేకుండా చేస్తున్నారు ఓటర్లు.

నాయకులు ఇప్పుడు పోటీలు పడి మరి జనంతో కలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఎవరిదైనా సరే ఏ కార్యక్రమైనా సరే జరుపుకుంటే అక్కడ ప్రత్యక్షం కావాల్సిందే. ప్రజల్ని కలిసేందుకు మీటింగ్‌లు పెడితే ఆర్థికంగా ఇబ్బంది.. అదే ఎవరి ఇంట్లో అయినా కార్యక్రమం చేసుకుంటే అక్కడకు వెళితే జన సమీకరణ లేకుండానే జనాల్ని కలవొచ్చు. తాము ఆ కార్యక్రమానికి హాజరయ్యామనే క్రెడిట్‌ కొట్టేయొచ్చు. ప్రస్తుతం నేతల తీరు ఇలాగే మారిపోయింది. వీరి వ్యూహానికి కొందరు ఆనందిస్తుండగా మరికొందరు మాత్రం వీళ్లు ఎందుకు వచ్చారా ? అనే విధంగా బాధ పడుతున్నారు. అవేమీ పట్టించుకోని నాయకులు మాత్రం పెళ్లి నుంచి కర్మకాండ తంతు వరకు.. పురుడు నుంచి బర్త్‌ డే వేడుకల వరకు దేనిని వదిలిపెట్టకుండా తమకు ప్లస్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. 
చావు నుంచి నేరుగా పెళ్లికి..
సాధారణంగా ఏదైనా చావు లాంటి కార్యానికి వెళితే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతనే తిరిగి ఏదైనా కార్యక్రమానికి హాజరవుతుంటారు. మరీ ముఖ్యంగా శుభకార్యాలకు హాజరయ్యేందుకు ఇవి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే పొలిటికల్‌ లీడర్లు మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదు. రూట్‌ మ్యాప్‌లో ఉంటే చాలు అటు కర్మకాండ, దశదినకర్మలకు వెళ్లినా సరే నేరుగా పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. దీంతో అక్కడున్న వారికి మనస్తాపాన్ని మిగుల్చుతున్నారు. ఎవరైనా శుభకార్యం చేస్తే వారి బంధు మిత్రులకు సరిపడా అంచనాలతో భోజనాలు సిద్దం చేస్తారు. కానీ రాజకీయ నాయకుల రాకతో వారి అంచనాలు తలకిందులవుతున్నాయి. నేతలతో పాటు పాటు సెక్యూరిటీ, పాలోవర్స్‌ ఏదైనా 50 నుంచి వంద మందికి వస్తారు. దీంతో నాయకులతో వచ్చే వారికి భోజనాలు పెడితే తమ అంచనాలు తలకిందులై ముందు పిలిచిన అతిధులకు భోజనాలు సరిపోవడం లేదని.. పెళ్లి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఒక తలనొప్పి కాగా పార్టీలకు సంబంధం లేని వారి కార్యక్రమాలకు నాయకులు హాజరైతే గ్రామాలలో వారిని ఆ నేత అనుచరులుగా మారుస్తుండటంతో కొన్ని చోట్ల అవి వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండగా కొంత మంది కార్యక్రమాలకు హాజరై మిగతా ఇళ్లలో కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో దూరం కూడా పెంచుతుంది. 
పరామర్శకు వస్తే పైసలే..
పొలిటికల్‌ అటెండెన్స్‌ ట్రెండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అది కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాయకులు పోటీ పడి మరీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. జిల్లాలోని ఓ ఇద్దరు నాయకులు ఏదైనా చావుకు హాజరైతే రూ.10 వేలకు తక్కువ కాకుండా అందజేస్తారనే ప్రచారం ఉంది. జనం చేసుకునే కార్యక్రమాల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కొంత మందిని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా జనం మధ్యలో ఉన్నామని చెప్పుకునేందుకు నేతలు ఇలా పెళ్లిళ్లు, కర్మకాండ, దశదినకర్మలను దేనిని వదలడం లేదు. నేతల రాక కొందరికి ఆనందాన్నిస్తుంటే, మరికొందరికి బాధను మిగిల్చుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపితే ఈ ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget