అన్వేషించండి

Nalgonda Crime News: పింఛన్ ఆశతో భర్తను చంపిన భార్య- హెల్ప్ చేసిన కుమారుడు!

Nalgonda Crime News: పొలంపై ఆశతో కుమారుడు, పింఛన్ వస్తుందనే ఆశతో భార్య కలిసి ఆ కుటుంబ పెద్దను చంపేందదుకు పథకం పన్నారు. డబ్బులిచ్చి మరీ కిరాయి హంతకుడితో చంపించేశారు. 

Nalgonda Crime News: తండ్రిని చంపితే అతని పేరిట ఉన్న పొలం అంతా తనకే దక్కుతుందని కుమారుడు, భర్తను చంపితే తనకు నెలనెలా పింఛన్ వస్తుందని భావించిన భార్య కలిసి.. కుటుంబం పెద్దను చంపేద్దామనుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి డబ్బులు పోగేసి మరీ కిరాయి హంతకుడితో భర్తను హత్య చేయించారు. అయితే వారు అనుకున్నట్లు పొలం, పింఛన్ కు బదులుగా.. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. 

వెంకటయ్య హత్యకు లక్ష రూపాయల సుపారీ..

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్యకు భార్య సుగుణమ్మ, కుమారుడు కోటేశ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా... వెంకటయ్య చిన్నగూడెంలో ఉంటున్నాడు. ఆయన భార్య, కుమారుడు మాత్రం అనుముల మండలం పులిమామిడిలో ఉంటున్నారు. చిన్నగూడెంలోని ఎకరం పొలాన్ని అమ్మాలని భార్య, కుమారుడు కొన్ని రోజులుగా వెంకట్యపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అందుకు మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. దీంతో ఎలాగైనా సరే అతడిని అడ్డు తొలగించుకుంటే తనకు పొలం దక్కుతుందని కుమారుడు భావించాడు. భర్తను హత్య చేస్తే తనకు వితంతు పింఛన్ వస్తుందని ఆశ పడింది. ఇందుకోసం వీరిద్దరూ కలిసి మారేపల్లిలోని అనుముల మహేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష రూపాయలు ఇస్తే.. వెంకటయ్యను చంపేందుకు అతను కూడా ఓకే చెప్పాడు. ముందస్తుగా 15 వేల రూపాయలు కూడా చెల్లించారు. 

చంపి మృతదేహంపై ఉన్న బట్టలు తొలగింపు..

పథకం ప్రకారం తల్లి, కుమారుడు కలిసి వెంకటయ్యను ఈనెల 14వ తేదీన ఉదయం పులిమామిడికి రప్పించారు. అదే రోజు సాయంత్రం తిరిగి చిన్నగూడెంలో దింపుతామని కోటేశ్, మహేశ్‌ తీసుకొచ్చిన కారులో తన తండ్రిని ఎక్కించుకొని మారేపల్లి వైపు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో వెంకటయ్యకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆయన మెడకు కోటేశ్, మహేష్ టవల్ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని అనుముల సమీపంలో పడేసి అతని ఒంటిపై ఉన్న దుస్తులను తీసుకెళ్లారు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం ఉన్న స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అప్పుడే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి భఆర్య, కుమారుడిపై అనుమానంతో వారిద్దరి కాల్ డేటా పరిశీలించారు. 

చివరకు పోలీసులకు పట్టుబడిన తల్లీ, కుమారులు..

చివరకు వారిద్దరే ఈ కిరాతకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. సోమవారం నల్గొండ నుంచి పులిమామిడికి కారులో వస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వారిని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. భూము కొనుగోలుకు ఒప్పుకోకపోవడం వల్లే.. భూము కోసం తాను, పింఛన్ వస్తుందని తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కు డబ్బులు ఇచ్చి మరీ హత్య చేశామని అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 2019లో ఓ మైనర్ బాలిక అదృశ్యమైన కేసులో మహేశ్ నిందితుడని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget