అన్వేషించండి

Wyra Project: వైరా రిజర్వాయర్‌ శిఖం భూములపై ఆక్రమణదారుల కన్ను.. కబ్జా కోరల్లోనే వందల ఎకరాలు

ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వైరా రిజార్వాయర్‌ భూములు ఇప్పుడు ఆక్రమణ దారుల కబ్జాలోకి వెళ్లాయి. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతుండటంతో ఇప్పుడు ఆక్రమణదారులు శిఖం భూములపై కన్నేశారు.

భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. బంగారం కంటే భూమిపైనే ఇప్పుడు అందరి దృష్టిపడుతుంది.. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పాగా వేసేందుకు వెనుకంజ వేయడం లేదు.. పచ్చటి పైరుకు నీరు ఇవ్వడంతోపాటు మంచినీటిని అందిస్తున్న చెరువు శిఖాలు మాయమవుతున్నాయి.. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతుండటంతో ఇప్పుడు ఆక్రమణదారులు శిఖం భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వైరా రిజార్వాయర్‌ భూములు ఇప్పుడు ఆక్రమణ దారుల కబ్జాలోకి వెళ్లాయి.

ఖమ్మం నగరానికి సమీపంలోని వైరా పరిసర ప్రాంతాలు ఉండటం.. మరోవైపు వైరా మున్సిపాలిటీగా ఏర్పడటంతో ఇక్కడ భూముల విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆక్రమణదారుల కళ్లు వైరా రిజర్వాయర్‌ శిఖం భూములపై పడ్డాయి. ఇక్కడ ఎకరం కోటి రూపాయల వరకు పలుకుతుండటంతో అదే పనిగా శిఖం భూములను మాయం చేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఏడాది రిజర్వాయర్‌లో నీటి మట్టం పడిపోవటంతో రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న రైతులు ఎంచక్కా రోజుకు ఎకరం చొప్పున రిజర్వాయర్‌ శిఖంపై కన్నేశారు. నీళ్ళు లేకపోవటంతో అక్రమార్కుల కళ్ళు వైరా రిజర్వాయర్‌పై పడింది.  వైరా పరిసర ప్రాంతాలపై ఇప్పటికే రియల్టర్లు ఖాళీ స్థలాలలపై బేరసారాలు చేస్తుండగా మరోవైపు ఇదే అదునుగా భావించి శిఖం భూమిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆక్రమణదారులు అదేపనిలో ఉన్నారు.

ఆక్రమణలతో రోజురోజుకు తగ్గుతున్న ప్రాజెక్టు భూమి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్‌ అతి పెద్ద ప్రాజెక్టు. సుమారు 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ 17,600 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా 11 మండలాలకు తాగునీటిని అందిస్తుంది. వైరా రిజర్వాయర్‌ శిఖం భూమి వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు మండలాల రెవిన్యూ పరిధిలో ఉంది. 70 శాతం పైగా కొణిజర్ల రెవిన్యూలో ఉండటంతో అటు కొణిజర్ల ఇటు వైరా మండలాల సరిహద్దుల్లో వైరా రిజర్వాయర్‌ విస్తరించి ఉంది. ప్రతి ఏడాది రిజర్వాయర్‌లో ఆశించిన స్థాయిలో నీళ్ళు లేకపోవటంతో రిజర్వాయర్‌ అంతా కూడా ఖాళీగా ఉండటంతో రైతుల అభ్యర్థన మేరకు నీటి పారుదల శాఖాధికారులు రిజర్వాయర్‌లో మట్టిని మాత్రమే సుమారు రెండు అంగుళాల లోతు నుండే మట్టిని తవ్వాలని నిబం«ధనలు ఉన్నాయి. కానీ మట్టి పేరుతో అనుమతులు లేకుండానే జేసీబీల సహాయంతో రాత్రి పగలు తేడా లేకుండా యధేచ్ఛగా మట్టితోలకాలు చేస్తున్నారు. అదే క్రమంలో రిజర్వాయర్‌ శిఖంపై కన్నేసిన కబ్జాదారులు ఎంచక్కా రిజర్వాయర్‌ భూమిని కట్టలు పోసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. 

కబ్జా కోరల్లో వందల ఎకరాలు..
అనేకఏళ్ళుగా వైరా రిజర్వాయర్‌ శిఖం భూముల ఆక్రమణల పర్వం కొనసాగుతుంది. తాజాగా కొణిజర్ల మండలం సిద్దిక్‌ నగర్, లాలాపురం, గుండ్రాతి మడుగు, తల్లాడ మండలం కోడవటిమెట్టు, రెడ్డిగూడెం సరిహద్దుల్లో ఉన్న వైరా రిజర్వాయర్‌ లోతుట్టు ప్రాంతంలో మట్టి తోలకం పేరుతో ఏకంగా ఎటువంటి  అనుమతులు లే కుండా మట్టిని తరలించడం ఆనవాయితీగా వస్తుంది. గత ఏడాది కొడవటిమెట్ట రెవెన్యూ పరిధిలో ఏకంగా అధికారపార్టీకి సంబంధించిన ఓ వ్యక్తి సుమారు ఎకరం పైగా ఆక్రమించి చేపల చేరువు సాగు చేసేందుకు శిఖం భూమిని ఆక్రమించగా అధికారులు అడ్డుకున్నారు. కానీ అదే ప్రాంతంలో కొంతమంది శిఖం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇలా రిజర్వాయర్‌ చుట్టూ సుమారు ఐదు కిలోమీటర్ల మేర శిఖం భూమి ఆక్రమణకు గురవుతుంది. అధికారులు తమకేమి పట్టనట్లే వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఏకంగా వైరా పట్టణానికి ఆనుకొని ఉన్న శిఖం భూమిలో ఫంక్షన్‌ హాల్, చేపల చెరువు ఉండటం గమనార్హం. సుమారు 250 ఎకరాల వరకు వైరా శిఖం భూమి ఆక్రమణకు గురైనట్లు సమాచారం. ఏళ్ళ తరబడి ఆక్రమణకు గురవుతున్న అటు రెవిన్యూ, నీటి పారుదల శాఖాధికారులు కనీసం ఆక్రమణ దారులకు కనీసం నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. దీంతో  గుండ్రాతి మడుగు రెవిన్యూలో కబ్జాదారులు సుబాబుల్, బొప్పాయి, మొక్కజోన్న వేసి సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం సుమారు రూ.కోటి వరకు ఉండటంతో శిఖం భూమి ఆక్రమణకు గురవుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఆక్రమణలను అడ్డుకుని శిఖం భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా రిజర్వాయర్‌ శిఖం భూమి ఆక్రమణకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి మట్టం 16 అడుగులు ఉండటంతో వేసవిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించి శిఖం భూమికి పెన్సింగ్‌ వేస్తామని పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget