అన్వేషించండి

KCR: త్వరలో 3.95 లక్షల మందికి లేఖ‌లు రాయ‌నున్న సీఎం కేసీఆర్, ఎందుకంటే?

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు గుర్తించారు.

మునుగోడు ఉప ఎన్నికలో విజయం అనేది మూడు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిన తరుణంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఎవరూ వదులుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందరికీ సీఎం కేసీఆర్ లేఖలు రాయనున్నారు. ప్రభుత్వం తరపున అందుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరికీ ఆ లేఖలు చేరనున్నాయి. సంక్షేమ పథకాల గురించి ఆ లేఖలో వివరించనున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు గుర్తించారు. వీరందరికీ లేఖలు రాయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆ లేఖల్లో కేసీఆర్ కోరనున్నారని తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణులకు కేసీఆర్ కిట్లు, సీఎం రిలీఫ్ ఫండ్, గొర్రెల పంపిణీ, పంట రుణాల మాఫీతో పాటు ఇతర పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నట్లుగా టీఆర్ఎస్ గుర్తించింది. ఆ లబ్ధిదారులకు కేసీఆర్ లేఖలు రాసి వారి మద్దతు కోరనున్నట్లుగా తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులు ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల రూపంలో రూ.10,260 కోట్ల మేర లబ్ధి పొందినట్లుగా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు లెక్కలు తీశారు. మొద‌టి సారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత మేరకు లబ్ధి చేకూరిందో కేసీఆర్ ఆ లేఖల్లో పేర్కొంటార‌ని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది.

టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలిపింది. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని స్థానిక నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.

మునుగోడు బైపోల్ ముఖ్యమైన తేదీలివే
ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
TRS Kavitha : కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
కవిత నోట టీఆర్‌ఎస్ మాట! అదే పేరుతో పార్టీ పెడుతున్నారా? మీడియాతో చేసిన కామెంట్స్‌కు అర్థమేంటీ? 
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget