అన్వేషించండి

Munugode ByElections: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసులు - నేటి సాయంత్రం వరకు గడువు

కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి శనివారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల సమయంలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

Komatireddy RajaGopal Reddy Gets Notice From Election Commission: హైదరాబాద్‌: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. మునుగోడు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సంస్థ నుంచి దాదాపు 5.24 కోట్ల రూపాయలను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాజగోపాల్ రెడ్డికి శనివారం నోటీసు జారీ చేసింది. ఈ ఫిర్యాదులోని అన్ని అంశాలపై సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం పంపాలని రాజగోపాల్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఎన్నికల సమయంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసి, వివరణ కోరింది.

టీఆర్ఎస్ ఆరోపణలు, ఫిర్యాదు ఇదే.. 
రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా నుంచి అక్టోబర్ 14, 18, 29 తేదీలలో మునుగోడు నియోజకవర్గంలోని 22 మంది వేర్వేరు వ్యక్తుల ఖాతాకు కోట్ల రూపాయల నగదు బదిలీ అయింది. ఈ క్యాష్ విత్ డ్రా చేసి ఓటర్లకు పంచడానికి ట్రాన్స్‌ఫర్ చేశారని టీఆర్ఎస్ నేత ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టెందుకే రాజగోపాల్ రెడ్డి ఈ నగదు బదిలీ చేయించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ నగదు మీ ఆదేశాలతో కంపెనీ బదిలీ చేసి ఉన్నట్లయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ ఖాతాల్లోకి నగదు జమ చేయలేదని భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు బదిలీ చేసినట్లయితే ఎన్నికల నియమావళి ప్రకారం అది అవినీతి చర్య, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుందని టీఆర్ఎస్ నేతలు అన్నారు.

టీఆర్ఎస్ నేత భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు ఇచ్చింది. నగదు బదిలీకి సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు టీఆర్ఎస్ నేతలు. ఆ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయకుందే ఆ 22 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీనీ టీఆర్ఎస్ నేత భరత్ కుమార్ కోరారు. 

ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారని దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే అధికార టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సైతం సుశీ ఇన్‌ఫ్రా నుంచి కోట్ల రూపాయల నగదు బదిలీపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. మునుగోడు ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget