అన్వేషించండి

Munugode By Elections: వాడు పోతుండు, వీడు పోతుండని పిచ్చి రాతలు - నిఖార్సైన వారే పార్టీలో ఉంటారన్న రఘునందన్ రావు

Munugode By Elections: మునుగోడులో గెలిచేది బీజేపీ అభ్యర్థేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాళోజీ చెప్పినట్లుగా అన్యాయం చేసినోళ్లను మునుగోడు ప్రజలు బొందపెడతారని అన్నారు. 

Munugode By Elections: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. నేతలు ఒకరికి మించి మరొకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. నువ్వా - నేనా అన్నట్లుగా ప్రచార బరిలో తలపడుతున్నాయి. ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. సవాలుకు ప్రతి సవాల్ విసురుతూ.. రాజకీయ కాక రేపుతున్నారు. రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. మూడు ప్రధాన పార్టీల కీలక నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మద్దతు దారులతో మునుగోడులో రాజకీయ సమరం సాగుతోంది. 

'నిఖార్సైన వారే పార్టీలో ఉంటారు'

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మునుగోడులో క్షేత్రస్థాయిలో చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మునుగోడులో యుద్ధం మొదలైందని.. మన దండు అటుపక్క ఉంటదా ఇటుపక్క ఉంటదనే పంచాయతీ నడుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రైతు పండించిన పంటను చాటలో పోసి ఎగబోస్తాడు.. తాను పండించిన పంటలు తాలు వెళ్లిపోతుంది ఎంత మంది పోయినా నాణ్యమైన వడ్లలాగా నిఖార్సైన వాళ్లే మిగులుతారు అని రఘునందన్ రావు అన్నారు. 

'ఉడత ఊపులకు, కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు '

"సోషల్ మీడియాలో వాడు పోతుండు.. వీడు పోతుండని పిచ్చి రాతలు, పిచ్చికూతలు వస్తున్నాయి. నాటి కౌరవ యుద్ధంలో వంద మంది వేసుకొని వచ్చిన దుర్యోధనుడికి ఏలాంటి శాస్తి జరిగిందో.. రేపు మునుగోడులో కూడా అదే జరగబోతుంది. కేసీఆర్ ని ఫాంహౌస్ కి కేటీఆర్ ని.. అమెరికాకి కవితక్కను ఏదో వ్యాపారం పెట్టుకుంది అంట అక్కడికి పంపివ్వడం ఖాయం. కాళోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీద పుట్టినోడు ఈ గడ్డకి అన్యాయం చేస్తే ఇక్కడే బొంద పెడతామని చెప్పినట్టు అన్యాయం చేసినోన్ని ఇక్కడే బొంద పెట్టాలి. రెడీగా ఉండండి ఉడత ఊపులకు, కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. పోలీసు మిత్రులు చట్టాన్ని మీరు గౌరవించండి. మేము మిమ్మల్ని గౌరవిస్తాం" అని దుబ్బాక ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. 


ఒక వకీలుగా మా యువతకు  భరోసా ఇస్తున్నానని అన్నారు. "మనం అందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులమే.. మేము మర్యాదగా ఉంటున్నాం.. మా సహనాన్ని మీరు చేతగానితనం అనుకుంటే ఖబడ్దార్.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకు ఎవరూ కూడా బేంబేలు ఎత్తొద్దు. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు మాతో టచ్ లో ఉన్నారు. వాళ్ల నెంబర్లతోని మాట్లాడటం లేదు. వేరే నెంబర్లతో మాట్లాడుతున్నారు. మీరు మునుగోడు గెలిస్తే మేమే తాళాలు వేసి మీ దగ్గరికి వస్తామని చెబుతున్నారు. కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యాజమాన్యాలు కూడా తప్పుడు ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" అని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Embed widget