అన్వేషించండి

Singareni Jobs 2022: సింగరేణిలో అసలేం జరుగుతోంది ! ఉద్యోగ నియామక పరీక్షలపై అనుమానాలెందుకో ?

సింగరేణి క్రమశిక్షణకు మరోపేరున్న ప్రభుత్వ రంగ సంస్థ.. పారదర్శకతకు ఎప్పటికీ వెన్నువెరవని సింగరేణిలో అసలెం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. సింగరేణిలో ఉద్యోగం సాదించాలంటే నిరుద్యోగులకు ఒక కలలాంటిది.. అలాంటిది సింగరేణిలో రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న ఆరోపణలు.. ఇప్పుడు సింగరేణిలో అసలెం జరుగుతుందనే అనుమానాలను రేకెత్తిస్తుంది.

వరుసగా మూడు పరీక్షలు జరిగాయి. కానీ అన్ని పరీక్షలపై అనుమానాలే.. అయినా ఈ దపా జరిగిన పరీక్షల్లో పారదర్శకత చూపిస్తారంటూ అటు నిరుద్యోగులు, ఇటు సింగరేణి వర్గాలు భావించినప్పటికీ మళ్లీ పాత పాటే అన్నట్లుగా ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 çపరీక్షల సందర్భంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ తాము అంతా సక్రమంగానే చేశామని సింగరేణి అధికారులు, అటు జేఎన్‌టీయూ అధికారులు చెబుతునప్పటికీ పరీక్ష జరిగే రోజునే కొంత మంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలలో తప్పులు దొర్లడంతో పాటు ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణ తీరుతో అభ్యర్ధులకు అనేక అనుమానాలు వచ్చాయి. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలన చేశామని చెప్పిన అధికారులు ఫలితాలు విడుదల విషయంలో తప్పులు దొర్లడంపై ఇప్పుడు అభ్యర్ధులను గందరగోళానికి గురిచేసింది. కేవలం 177 పోస్టులకు లక్ష మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 70 వేల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షా పలితాల విడుదలలో తప్పులు దొర్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
పారదర్శత ఏమైంది..?
పరీక్షల పలితాలలో సింగరేణి అధికారులు పారదర్శకత పాటించలేదని అభ్యర్ధులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నాయి. 70 వేల మంది పరీక్షలు రాయగా అందులో కేవలం 49 వేల మంది పరీక్షలలో అర్హత సాదించారని, వారి మార్కులతోపాటు ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తమకు మార్కులు ఎన్నివచ్చాయో..? అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. అందరి మార్కులు వివరాలు వెల్లడించిన తర్వాత ర్యాంకులు విడుదల చేయాల్సి ఉనప్పటికీ కేవలం అర్హత పేరుతో 49 వేల మంది పలితాలు విడుదల చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తాను ఎన్ని మార్కులు సాధించాననే విషయం తెలియక ఇప్పుడు గందరగోళంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. 
ముచ్చటగా మూడోసారి ఇదే తంతు..?
2015లో సింగరేణి సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ పరీక్షల ఫ లితాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షా పేపర్‌ ముందుగానే లీకైందనే విషయంతోపాటు కేవలం దొడ్డిదారిన వెళ్లిన వారికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆ తర్వాత నిర్వహించిన జేఎంఈ (జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌) పరీక్షల నిర్వహణ సందర్భంగా ఏకంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అభ్యర్ధులు దొరకడం, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ పట్టుబడ్డారు. కాగా ఈ విషయంలో విచారణ సందర్భంగా 2015లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన వారు ఉండటం, విచారణ మధ్యలోనే నిలిపివేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు ఈ మూడు పరీక్షలు నిర్వహణలోనూ ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి.

పరీక్షలకు కేవలం 15 రోజుల ముందు సింగరేణిలో కీలకమైన డైరెక్టర్‌ ‘పా’ పదవి చంద్రశేఖర్‌కు ఇవ్వడం, కేవలం ఐదు నెలల ముందుగా రిటైర్డ్‌ అయ్యే వ్యక్తికి ఇప్పుడు ఆ పదవి కట్టుబెట్టడంతో సింగరేణిలో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జేఎంఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా జరిగిన అనుమానాలపై అభ్యర్ధులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం, అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ పరీక్షల సమయంలో పదవిని ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటీ ప్రతి విషయంలో పారద్శకంగా ఉంటామని చెప్పే సింగరేణి యాజమాన్యం ఇప్పుడు పరీక్షల నిర్వహణలో వస్తున్న ఆరోపణలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget