అన్వేషించండి

Singareni Jobs 2022: సింగరేణిలో అసలేం జరుగుతోంది ! ఉద్యోగ నియామక పరీక్షలపై అనుమానాలెందుకో ?

సింగరేణి క్రమశిక్షణకు మరోపేరున్న ప్రభుత్వ రంగ సంస్థ.. పారదర్శకతకు ఎప్పటికీ వెన్నువెరవని సింగరేణిలో అసలెం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. సింగరేణిలో ఉద్యోగం సాదించాలంటే నిరుద్యోగులకు ఒక కలలాంటిది.. అలాంటిది సింగరేణిలో రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న ఆరోపణలు.. ఇప్పుడు సింగరేణిలో అసలెం జరుగుతుందనే అనుమానాలను రేకెత్తిస్తుంది.

వరుసగా మూడు పరీక్షలు జరిగాయి. కానీ అన్ని పరీక్షలపై అనుమానాలే.. అయినా ఈ దపా జరిగిన పరీక్షల్లో పారదర్శకత చూపిస్తారంటూ అటు నిరుద్యోగులు, ఇటు సింగరేణి వర్గాలు భావించినప్పటికీ మళ్లీ పాత పాటే అన్నట్లుగా ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 çపరీక్షల సందర్భంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ తాము అంతా సక్రమంగానే చేశామని సింగరేణి అధికారులు, అటు జేఎన్‌టీయూ అధికారులు చెబుతునప్పటికీ పరీక్ష జరిగే రోజునే కొంత మంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలలో తప్పులు దొర్లడంతో పాటు ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణ తీరుతో అభ్యర్ధులకు అనేక అనుమానాలు వచ్చాయి. ప్రతీది క్షుణ్ణంగా పరిశీలన చేశామని చెప్పిన అధికారులు ఫలితాలు విడుదల విషయంలో తప్పులు దొర్లడంపై ఇప్పుడు అభ్యర్ధులను గందరగోళానికి గురిచేసింది. కేవలం 177 పోస్టులకు లక్ష మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 70 వేల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షా పలితాల విడుదలలో తప్పులు దొర్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
పారదర్శత ఏమైంది..?
పరీక్షల పలితాలలో సింగరేణి అధికారులు పారదర్శకత పాటించలేదని అభ్యర్ధులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నాయి. 70 వేల మంది పరీక్షలు రాయగా అందులో కేవలం 49 వేల మంది పరీక్షలలో అర్హత సాదించారని, వారి మార్కులతోపాటు ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తమకు మార్కులు ఎన్నివచ్చాయో..? అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు. అందరి మార్కులు వివరాలు వెల్లడించిన తర్వాత ర్యాంకులు విడుదల చేయాల్సి ఉనప్పటికీ కేవలం అర్హత పేరుతో 49 వేల మంది పలితాలు విడుదల చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి తాను ఎన్ని మార్కులు సాధించాననే విషయం తెలియక ఇప్పుడు గందరగోళంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. 
ముచ్చటగా మూడోసారి ఇదే తంతు..?
2015లో సింగరేణి సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ పరీక్షల ఫ లితాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షా పేపర్‌ ముందుగానే లీకైందనే విషయంతోపాటు కేవలం దొడ్డిదారిన వెళ్లిన వారికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆ తర్వాత నిర్వహించిన జేఎంఈ (జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌) పరీక్షల నిర్వహణ సందర్భంగా ఏకంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అభ్యర్ధులు దొరకడం, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ పట్టుబడ్డారు. కాగా ఈ విషయంలో విచారణ సందర్భంగా 2015లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన వారు ఉండటం, విచారణ మధ్యలోనే నిలిపివేయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు ఈ మూడు పరీక్షలు నిర్వహణలోనూ ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి.

పరీక్షలకు కేవలం 15 రోజుల ముందు సింగరేణిలో కీలకమైన డైరెక్టర్‌ ‘పా’ పదవి చంద్రశేఖర్‌కు ఇవ్వడం, కేవలం ఐదు నెలల ముందుగా రిటైర్డ్‌ అయ్యే వ్యక్తికి ఇప్పుడు ఆ పదవి కట్టుబెట్టడంతో సింగరేణిలో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జేఎంఈ పరీక్షల నిర్వహణ సందర్భంగా జరిగిన అనుమానాలపై అభ్యర్ధులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం, అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ పరీక్షల సమయంలో పదవిని ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటీ ప్రతి విషయంలో పారద్శకంగా ఉంటామని చెప్పే సింగరేణి యాజమాన్యం ఇప్పుడు పరీక్షల నిర్వహణలో వస్తున్న ఆరోపణలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
Paris Olympics 2024: అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Double iSmart: 'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
'డబుల్‌ ఇస్మార్ట్‌' సాంగ్‌లో కేసీఆర్ వాయిస్‌ వాడటంపై వివాదం - వివరణ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మ
Paris Olympics 2024: అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
అట్టహాసంగా ప్రారంభమైన విశ్వ క్రీడా సంబరం
Wine Shops Closed : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రెండ్రోజులు వైన్స్ షాపులు బంద్
Darshan: కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం
కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం
Karate Kalyani: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
పిల్లల సేఫ్టీ కోసం యాపిల్‌ సరికొత్త ఫీచర్​ - ఇది ఉంటే పేరెంట్స్​కు నో టెన్షన్​​!
పిల్లల సేఫ్టీ కోసం యాపిల్‌ సరికొత్త ఫీచర్​ - ఇది ఉంటే పేరెంట్స్​కు నో టెన్షన్​​!
Viral News: గ‌రం గ‌రం గులాబీ పూల బజ్జీలు - వైరల్ అవుతున్న వీడియో చూశారా
గ‌రం గ‌రం గులాబీ పూల బజ్జీలు - వైరల్ అవుతున్న వీడియో చూశారా
Embed widget