అన్వేషించండి

Bhatti Vikramarka: బీఆర్ఎస్ వల్లనే యాదాద్రి ప్లాంట్ ఆలస్యం, ఖర్చు కూడా ఎగబాకింది - భట్టి

Nalgonda News: భట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులకు అభినందనలు తెలిపారు.

Yadadri Thermal Power Station: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పూర్తి చేసే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అందుకే దాని ప్రాజెక్టు వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

‘‘8.2.2015 న పవర్ ప్లాంట్ పనులకు పునాది పడింది. 17.10.2015 న పనులు మొదలుపెట్టారు. 2020 అక్టోబర్లో రెండు యూనిట్లు 2021లో మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది. ప్రాజెక్టును అనుకున్న కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, నిత్యం సమీక్షలు లేకపోవడం మూలంగా ఆర్థిక భారం పెరిగింది.

ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చేనాటికి పవర్ ప్రాజెక్టు అనుమతులు నిరాకరణకు గురయ్యాయి. 50 శాతం విదేశీ బొగ్గు మరో 50 శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్‌జీటీకి చెప్పారు. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయి. అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్జీటీకి కావలసిన పబ్లిక్ హియరింగ్ ను గత ఫిబ్రవరిలో చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చాం.

మేము అధికారంలోకి వచ్చాక నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వారానికి ఒకసారి సమీక్ష చేపట్టాం. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం.. క్యాలెండర్ ఖరారు చేసాం. 31 మార్చి 2025 నాటికి 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకున్నాం. రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తిచేయాలని నిర్ణయించాం. మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్లను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన రెండు యూనిట్లు 2025 మార్చికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం. 

ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుంది అనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది. మా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర రూ.6.35 రూపాయలుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం ఇది. భూ నిర్వాసితులు గొప్ప త్యాగధనులు. భూ సేకరణ పరిహారం చెల్లించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Embed widget