By: ABP Desam | Updated at : 08 Sep 2022 08:37 AM (IST)
చనిపోయిన గర్భిణీకి వైద్యం, గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందం!
Doctors Cheating: ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణీకి శస్త్ర చికిత్స చేశారు. అయితే అది వికటించి ఆమె అక్కడే మృతి చెందింది. కానీ ఆమె పరిస్థితి విషమించింది హైదరాబాద్ కు తీసుకెళ్తున్నామని నమ్మబలికారు. కాసేపయ్యాక వచ్చి ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని వివరించారు. వారి మాటలు నమ్మకం కల్గించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గొడవకు దిగారు. దీంతో.. ఆస్పత్రి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వారికి 8 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
చనిపోయిన మహిళకు చికిత్స చేస్తూ..
నల్గొండ జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం... ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. ఆదివారం రోజు సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కాసేపటికే.. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ అక్కడే చనిపోయింది. అయితే తాము చేసిన శస్త్ర చికిత్స వికటించే ఆమె చనిపోయిందని తెలిసి ఎక్కడ గొడవ చేస్తారో అనుకున్న ఆస్పత్రి యాజమాన్యం ఓ సరికొత్త ప్లాన్ వేసింది. అచ్చం ఠాగూర్ సినిమాలో లాగానే చనిపోయిన గర్భిణీ మహిళకు చికిత్స అందించింది. అయితే ఆమె పరిస్థితి విషమించిందని చెప్పి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిందని నమ్మబలికారు.
గుట్టుచప్పుడు కాకుండా ఒప్పంద పత్రం..
అయితే వైద్యులు సంబంధం లేకుండా పది నిమిషాలకో వార్త చెప్పేసరికి మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. మీ నిర్లక్ష్యం వల్లే నిండ గర్భిణీ మృతి చెందిందంటూ నానా రచ్చ చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పింది. దీంతో బాధిత కుటుంబీకులు కాస్త చల్లబడ్డారు. అక్కడికక్కడే 8 రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ఆస్పత్రి యాజమాన్యం ఒప్పంద పత్రం కూడా రాసిచ్చింది. ఇది కాస్తా మీడియాకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే కు.ని ఆపరేషన్లు ఫెయిల్ అయి నలుగురు మృతి..
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నాలుగురు మహిళలు మృతి చెందిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనకు నివారణ చర్యలు చేపట్టిన తెలంగాణ వైద్యశాఖ తప్పడగువేసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణకు ఆదేశించాం..మరో వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పిన వైద్యశాఖ ఉన్నాతాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంది. ఆయనపై శాశ్వతంగా అనర్హత వేటువేశారు. కొందరు డాక్టర్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం చేశారు. ఇదంతా చూస్తుంటే తప్పు జరిగిన మూలాలు గుర్తించి, మరోసారి అలాంటి విషాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కంటే తప్పును పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాంపులతో మాఫీ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rangareddy Assembly Election Results 2023: రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్
Nizamabad Assembly Election Results 2023: నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Medak Assembly Election Results 2023: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Losing Minister 2023:ఆరుగురు మంత్రులకు షాక్ ఇచ్చిన ఓటర్లు
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
/body>