అన్వేషించండి

Komatireddy-Modi Meeting: నిన్న ఖర్గేతో, రేపు మోదీతో కోమటిరెడ్డి భేటీ - వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారు?

అగ్రనేతలను వరుసగా కలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఏం మంతనాలు జరుపుతున్నారని ఆసక్తికరంగా మారింది.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అందుకోసం ఆయనకు ప్రధాని అపాయింట్‌మెంట్ నేడు ఖరారైంది. రేపు (డిసెంబరు 16) ఉదయం మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయానికి రావాలని పీఎంవో నుంచి కోమటిరెడ్డికి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం భువనగిరిలో అభివృద్ది పనులపై చర్చించడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోదీ అపాయింట్మెంట్ కోరారు. మోదీ కలిసే సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరిన్ని కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలుష్యం కారణంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని దృష్టికి తేనున్నట్లు సమాచారం. నమామి గంగ తరహాలో నమామి మూసీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రధానిని కోరతారని అంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‭కు సంబంధించి కూడా పలు అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ హైవే గురించి కూడా వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పరిణామంతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఖర్గేతోనూ భేటీ
ఇటీవలే పీసీసీకి చెందిన కమిటీలను ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. కొన్నాళ్లుగా ముఖ్యంగా తమ్ముడు బీజేపీలో చేరిన నాటి నుంచి కోమటిరెడ్డి అంటీముట్టనట్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదు. పైగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తర్వాత ఇటీవల పీసీసీ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి నిన్న (డిసెంబరు 14) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై తాను ఖర్గేతో చర్చించానని, ఖర్గే అంతా విన్నారని ఆయన్ని కలిశాక వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారని అన్నారు. కీలక విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదని ఖర్గేకు కోమటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే, ఆ విషయాలు విన్న అనంతరం తాను త్వరలోనే తెలంగాణ నేతలతో సమావేశం అవుతానని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.

మొత్తానికి అగ్రనేతలను వరుసగా కలుస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారితో ఏం మంతనాలు జరుపుతున్నారని ఆసక్తికరంగా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Upcoming Telugu Movies: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
Embed widget