అన్వేషించండి

KTR: పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలి - ఈసీకి స్పష్టం చేసిన కేటీఆర్

Paper ballot elections: బీహార్‌లో పేపర్ బ్యాలెట్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. కాళేశ్వరం రిపోర్టును సభలో పెడితే ఫుట్‌బాల్ ఆడుకుంటామన్నారు.

KTR appeals for paper ballot elections:  ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. తిరిగి పేపర్ బ్యాలెట్ తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను  బీఆర్ఎస్ పక్షాన కోరామని  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.  తాము వేసిన వారికి ఓటు పోవడం లేదన్న అనుమానం ప్రజలకు వస్తే అది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.  *భారత ఎన్నికల కమీషన్ తో సమావేశం తరువాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. 

 నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టి, తరువాత జరిగే సాధారణ ఎన్నికలనూ బ్యాలెట్ తోనే నిర్వహించాలని  కోరామనని కేటీఆర్ స్పష్టం చేశానారు. ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని కేటీఆర్ చెప్పారు. కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్ఎస్ కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు. ఇక బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, కలుగుతున్న ఆందోళనలను తొలగించాలని కోరామన్నారు. కాళేశ్వరం కమీషన్ నివేదిక పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్న కేటీఆర్, మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్ బాల్ ఆడుకుంటామన్నారు. 
 
అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ తో పాటు ఇంకా చాలా దేశాలు ఈవీఎంలతో కొన్ని ప్రయోగాలు చేసి, ఆ తరువాత ప్రజలకు అనుమానాలు రావడంతో ఓటింగ్ మెషిన్లను వద్దనుకుని ఆయా దేశాలు తిరిగి పేపర్ బ్యాలెట్ కే వెళ్లాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం. దాదాపు  వంద కోట్ల ఓటర్లు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి దేశంలో మిషన్ లతో నష్టం జరుగుతుందని, తమ ఓటు అనుకున్న వ్యక్తికి పోవడం లేదని ప్రజలకు అనుమానాలు వస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోవాలని మా పార్టీ తరపున ఎలక్షన్ కమిషన్ ను కోరామమన్నారు. 

 బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ మీద వస్తున్న అనుమానాలు, దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని  అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనపై ఎన్నికల కమిషన్ తో మాట్లాడామమన్నారు. చనిపోయిన వారి, వలస కార్మికులు, స్పందించని వారి ఓట్లను తీసేశామని కమీషన్ చెప్పిందని.. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఓటర్ జాబితా సవరణ చేయాలని మేము చెప్పాము. ముఖ్యంగా తాలూకా లెవెల్లో.. మండల్ లెవెల్లో...బూత్ లెవల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చేస్తే అన్ని పార్టీల మద్దతు ఉంటుందని తెలిపామన్నారు. ఎవరి ఓట్లు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? ఏ కారణంతో తీస్తున్నారన్న విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పి పారదర్శకంగా తీసేయాలని ఎన్నికల కమీషన్ కు చెప్పామని కేటీఆర్ తెలిపారు. 
   
బీసీలతో కాంగ్రెస్ పార్టీ క్రూరమైన పరిహాసం ఆడుతుందని శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే మేము చెప్పామమని కేటీఆర్ గుర్తు చేశారు. 
42% రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే లేవు. ఇంకా వేరే హామీలు కూడా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా ఆ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు.  రాజకీయాల్లో 42 శాతం వాటా వస్తే రాజకీయ నాయకులకే లాభం జరుగుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే పేదవారికి లాభం జరగాలంటే 42% కాంట్రాక్టులు ఇవ్వండి, 42 శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఇవ్వాలన్నారు. 

 
655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని కేటీఆర్ విమర్శఇంచారు.  రిపోర్ట్ ఎవరూ చదవకముందే ఆ రెండు పత్రికలు మాత్రం రోత వార్తలను రాసి కేసిఆర్ గారి మీద , బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శఇంచారు. అసెంబ్లీలో మా మైకులు కట్ చేయకుండా మమ్మల్ని మాట్లాడిస్తే ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెపుతున్నారో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీకీ దమ్ముందా? అని ప్రశఅనించారు. కాళేశ్వరం, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి ఫుట్ బాల్ ఆడుతామని హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Razor Movie: 'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీల్లో NMC, LFP పేర్లు వింటున్నారా? వీటి మధ్య తేడాలేంటి?
EV బ్యాటరీలో అసలు మ్యాటర్‌ ఏంటి? మిక్సింగ్‌ మారితే పెర్ఫార్మెన్స్‌ ఎలా మారుతుంది?
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Embed widget