అన్వేషించండి

Sircilla Rajeshwari Passed Away: కాళ్లతో వందల కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు, ప్రముఖుల సంతాపం

Sircilla Rajeshwari passed away: చెదిరినా నా జీవితాన్ని చిత్రంల మార్చేశావు.. దీపం ఉంది కానీ.. వెలుగు లేదు.. మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది.." అంటూ ఎన్నో కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు.

Sircilla Rajeshwari passed away: చెదిరినా నా జీవితాన్ని చిత్రంల మార్చేశావు..
దీపం ఉంది కానీ.. వెలుగు లేదు..
మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది..
మనిషి ఉంది కానీ.. నిర్జివంగా ఉండిపోయింది.." అంటూ కవితలు రాసి ఎన్నో మనసులు గెలిచిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి వైద్య చికిత్స పొందుతుంది. ఈక్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచింది. తన ఆత్మవిశ్వాసంతో, మనోసంకల్పంతో విధిని ఎదురించి బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చి తన కాళ్లతో తిరిగి రాసుకున్న సిరిసిల్ల రాజేశ్వరి మరణవార్త విని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దివ్యాంగురాలు, మాటలు రావు.. చేతులు లేవు.. నడవలేని పరిస్థితి.. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి.. అయితేనేం ధృడసంకల్పం ఉంది. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. తన తల రాతను తానే తిరిగి రాసుకుంది. ఎన్నో హృద్యమైన కవితలు లిఖించి.. ఎందరో ప్రముఖులను కదిలించింది సిరిసిల్ల రాజేశ్వరి. సుమారు 500లకు పైగా కవితలు రాసింది రాజేశ్వరి.

తన కవిత్వాలతో.. తనకెంతో ఇష్టమైన రచయిత సుద్దాల అశోక్ తేజ మనసును కదిలించింది రాజేశ్వరి. ఆయనే స్వయంగా రాశేశ్వరి ఇంటికొచ్చి గుండెకు హత్తుకుని ఆశీర్వదించారు. అంతేకాకుండా.. రాజేశ్వరి రాసిన కవితలన్నింటినీ కలిపి.. కాళ్లతో కవితలు అనే పుస్తకాన్ని ప్రచురించి ఆమె ప్రతిభను విశ్వవ్యాప్తం చేశారు. రాజేశ్వరి పరిస్థితి తెలిసి.. తెలంగాణ సర్కారు.. రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. నెలనెలా రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నారు. రాజేశ్వరికి ఒక డబుల్ బెడ్ రూం ఇళ్లును కూడా కేటాయించారు.

“కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి.. కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి.. అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను.. గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుంది..!”
“కన్నీళ్లను కలం చేసి మనసును అక్షరాలుగా మలిచి బాధను భావంగా తలచి రాస్తున్నాను.. ఈ కావ్యాన్ని కవిత కోసం నేను పుట్టాను.. కాంతికోసం కలం పట్టాను.. వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం..!”
“నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్యకళ ఆగదు.. వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు, అయినా వెలుగుతూనే ఉంటాడు.. పారే జలపాతానికి కాళ్లు లేవు, అయినా జలజల పారుతూనే ఉంటుంది.. నాకు చేతులు లేవు, అయినా కానీ నాలో కవిత సాగుతూనే ఉంటుంది..!” అంటూ సిరిసిల్ల రాజేశ్వరి కవితా ఝరి సాగింది.

సిరిసిల్ల రాజేశ్వరి మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని  కేటీఆర్ అన్నారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి, ఆశయానికి కాదని, రాజేశ్వరి తన మనోత్సైర్యంతో నిరూపించిందన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమైన కేటీఆర్, రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

సిరిసిల్ల రాజేశ్వరి గురించి.....
సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో  కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు."సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం  ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత.రాజేశ్వరి రాసిన కవిత ను గమనిస్తేఆమె అక్షరాల  పదును  అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన  విషయం తెలిసిందే. 2014 లో  వచ్చిన ఈ కవిత సంకనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే  కానీ అమే 
 మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవల  నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం (28_ 12 _2022న) శాశ్వతంగా నిష్క్రమించారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. రాజేశ్వరికి వినమ్రంగా కన్నీటి నివాళులు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget