అన్వేషించండి

తెలంగాణలో మరోసారి గెలవండి- టీఆర్‌ఎస్‌కు రఘునందన్ రావు సవాల్

తనపై, బీజేపీపై మంత్రి హరీష్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మరోసారి ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. 

ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి హరీష్  తనపై, బీజేపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఆదాయం  ఎంత, ఖర్చు ఎంత, ఇప్పుడు ఎంతో మంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారంతో హరీష్ రావు స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 57 వేల పింఛన్లు ఇవ్వడం అబద్దం అని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఇళ్లే 50 వేలు ఉంటే.. మరి 57వేల మందికి పింఛన్ ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు. ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించేందుకు తిరుగుతున్నారని మంత్రి హరీష్ రావు అనడం నిజంగా బాధగా ఉందని కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాకుండా ఎవరు కత్తిరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 

ఓడిస్తే అభివృద్ధి ఆపడం ఎక్కడి సంస్కృతో..

మొన్ననే దుబ్బాక ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది గుర్తు లేదా అని వ్యాఖ్యలు చేశారు రఘునందన్‌రావు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోతే.. దుబ్బాక అభివృద్ధి ఆపడం ఎంత వరకు సమంజసమని, ఇది ఎక్కడి సంస్కృతి అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మూడు సంవత్సరాల నుంచి కేసీఆర్ స్కూల్ అట్లే ఉంటుందని.. చేతనైతే సీఎంతో ప్రారంభించాలన్నారు. దమ్ముంటే తెలంగాణలో మూడోసారి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రజలు కట్టిన పన్నుతోనే సంక్షేమ పథకాలు ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం.. వారి ఇంట్లో నుంచి ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పడం ఎందుకు అని విమర్శించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు..

అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మనుగోడులో తీర్పు ఇస్తారని మనుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.. ఉదయం తిరుమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు శ్రీవారి ఆశీస్సులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. ఓ కుటుంబం చేతిలోకి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని ఆరోపించారు. 

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. 

తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని రెండు  సార్లు అధికారం చేపట్టారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని, అడుగడుగునా ఉద్యమకారులను అవమానిస్తునే ఉన్నారని ఆరోపించారు రాజగోపాల్‌రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగజార్చారని ఆయన చెప్పారు. అరాచక పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా ప్రజలు మునుగోడులో తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క వ్యక్తి కోసం వచ్చిన ఎన్నికలు కావని, తెలంగాణ భవిషత్తు కోసం వచ్చిన ఎన్నికలని, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాన్ని కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి బుద్ది చెప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని, కుటుంబ రాక్షస పాలనా నుంచి తెలంగాణను కాపాడాలని ఆయన కోరారు. మునుగోడు ప్రజల తీర్పు శిరసా వహిస్తానని, తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget