By: ABP Desam | Updated at : 31 May 2023 04:32 PM (IST)
Edited By: jyothi
టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయం ఏర్పాటు - శంకుస్థాన చేసిన మంత్రి గంగుల, వైవీ సుబ్బారెడ్డి
Venkateshwara Temple Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఈ ఆలయ నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్ సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ఏపీ సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయం కరీంనగర్ లో కొలువుదీరడం తమ అదృష్టం అని చెప్పారు. ఆలయానికి 10 ఎకరాల భూమి మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం తమకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... తిరుమలలో మాదిరిగానే కరీంనగర్ లోనూ సర్వ కైంకర్యాలు జరుగుతాయని అన్నారు. టీటీడీ తరఫున అర్చకులు, సిబ్బంది, ప్రసాదంతో పాటు పాలు తదితరాలు ఉంటాయన్నారు. కరీంనగర్, తెలంగామ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డిని సత్కరించారు.
ఓం నమో వెంకటేశాయ
ఈరోజు కరీంనగర్ కు విచ్చేసిన
తిరుమల తిరుపతి దేవస్థానం
చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు#adminpost pic.twitter.com/SrhxIhCUom— Ponnam Prabhakar (@PonnamLoksabha) May 31, 2023
ఈనెల 31న కరీంనగర్ పట్టణంలోని స్థానిక పద్మనగర్ లో నిర్మించే టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజతో పాటు సాయంత్రం జరిగే శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా... టవర్ సర్కిల్ ప్రాంతంలో వాణిజ్య వ్యాపారులకు ఇంటింటికి బొట్టు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/ZcYkuQIKKh
— Gangula Kamalakar (@GangulaBRS) May 29, 2023
ఈరోజు జరిగే శంకుస్థాపన మహోత్సవానికి హాజరు కావాలని పట్టణంలో తిరిగి మరీ ప్రజలను ఆహ్వానించారు మంత్రి గంగుల కమలాకర్.
Top Headlines Today: వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న జగన్- తెలంగాణలో ఎంఐఎం గేమ్ ఛేంజర్ కానుందా?
Breaking News Live Telugu Updates:చిత్తూరు జిల్లా రెండు మండలాల్లో చిరుత సంచారం- ఒంటరిగా తరగొద్దని అధికారుల సూచన
Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!
Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
KNRUOH: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
/body>