అన్వేషించండి

గోదావరిలోకి వరద ప్రవాహం- కళకళలాడుతున్న ప్రాజెక్టులు

ఇప్పటికే పడి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరిసరాల్లో పడుతున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఐదు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు జనజీవనం ఇబ్బంది పడుతోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

తెలంగాణలో వాతావరణంపై రాత్రి 1 గంటకు ఐఎండీ ప్రత్యేక బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లా, కామారెడ్డి, కుమ్రంభీమ్‌ మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భవనగిరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఇప్పటికే పడి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరిసరాల్లో పడుతున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.  ప్రవాహం 48 అడుగులు దాటితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 

వివిధ ప్రాజెక్టల వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...
గోదావరి బేసిన్‌లో ఉన్న సింగూరులో పూర్తి స్థాయి నీటి మట్టం 1717.93 అడుగులు ఉంటే ప్రస్తుతం 1709.53అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 29.91 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 19.25 టీఎంసీల నీరు ఉంది. సింగూరుకు 8,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 385 క్యూసెక్కులను నీటిని బయటకు వదులుతున్నారు. 

నిజాం సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం 1388.03 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 17.8 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ 4.39 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 23,400 క్యూసెక్కులు ఉంటే బయటకు ఇంకా నీటిని విడుదల చేయడం లేదు. 
శ్రీరాం సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం -1091 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 1070.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు - ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 38.95 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 59,165 ఉంది. ప్రస్తుతానికి నీటిని బయటకు వదలడం లేదు. 

మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -1043.31 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -1025.69 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -27.50 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.72 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 4590 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 1700 క్యూసెక్కులు

లోయర్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం -920 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -896.35 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -24.07టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --8.55 టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 1522 క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో-226క్యూసెక్కులు

కడెం పూర్తిస్థాయి నీటి మట్టం -700అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -694.700 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -7.6 టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం --5.66టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 16,1800క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 104334క్యూసెక్కులు 

9 గేట్లు ఎత్తి నీటి విడుదల

 

ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం -485.56 అడుగులు 
ప్రస్తుతం నీటి మట్టం -478.94అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం -20.18టీఎంసీలు 
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం -15.96టీఎంసీలు 
ఇన్‌ఫ్లో - 10,226క్యూసెక్కులు 
అవుట్‌ ఫ్లో- 7559క్యూసెక్కులు

అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం సమ్మక్క బ్యారేజీ 8.76 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. మేడిగడ్డబ్యారేజీకి 5.65 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌ బ్యారేజీకి 9.57లక్షల క్యూసెక్కులుు, సుందిళ్ల బ్యారేజీకి 1296 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆయా ప్రాజెక్టుల్లో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Embed widget