అన్వేషించండి

Bandi Sanjay Letter to CM KCR: ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై CM కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్ర ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని.. 1వ తేదీన చెల్లించాలని బండి సంజయ్ అన్నారు. 

TS Govt Employees: తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు నిలువుటద్దమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి, పింఛన్‌దారులకు పెన్షన్లు ప్రతినెలా 1వ తేదీన చెల్లించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 2014లో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని, రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు. ప్రతినెలా 1 వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం, రిటైర్‌ అయినవారికి పెన్షన్‌ అందించడం ప్రభుత్వ బాధ్యత అని బండి సంజయ్ అన్నారు. 

ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప..
‘ఉద్యోగులు, పెన్షన్‌దారులు సకాలంలో వేతనాలు పొందే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఈ హక్కును మీ ప్రభుత్వం కాలరాస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 300(ఎ) ప్రకారం సకాలంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించింది. రాష్ట్రప్రభుత్వం సకాలంలో ఉద్యోగుల, పెన్షన్‌దారులకు సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమే. భారతరాజ్యాంగంలో ఆర్టికల్‌ 360 ప్రకారం ఫైనాన్షియల్‌ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదనే విషయం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా మీకు తెలియనిది కాదని’ కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఎమోషనల్ కథ చెప్పారు..
‘‘రిటైర్‌ అయ్యేనాటికే లెక్కా ఆచారం కంప్లీట్‌గా ఉండాలే. రిటైర్‌ అయ్యేలోపే ఉద్యోగులకు ఇయ్యాల్సిన ప్యాక్‌ తయారు చేసి, రెడీగా పెట్టి.. రిటైర్‌ అయిన రోజున ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి, పూల దండ ఏశీ, శాలువ కప్పి, ప్యాక్‌ చేతిల పెట్టి ప్రభుత్వ వాహనంలోనే ఆయన్ను ఇంటి దగ్గర దించి రావాలే అధ్యక్షా. దీన్ని వందకు వందశాతం తొందర్లోనే తీసుకొస్త’’ అని సీఎంగా మీరు అసెంబ్లీలో ఒక ఎమోషనల్‌ కథ చెప్పి సంవత్సరాలు గడుస్తున్నయ్‌ కానీ ఇప్పటికి పెన్షన్‌దారుల తిప్పలు తప్పలేదని బండి సంజయ్ అన్నారు. కనీస వైద్య ఖర్చులకు సైతం పెన్షన్‌ డబ్బులపైనే ఆధారపడే పెన్షన్‌దారుల ఇబ్బందులు వర్ణనాతీతం అన్నారు.

బండి సంజయ్ తన లేఖలో ఇంకా ఏం రాశారంటే.. ‘వేతనాలు, పెన్షన్‌లు మాత్రమే కాకుండా ఇతర అత్యవసర బిల్లులు కూడా తెలంగాణ ప్రభుత్వం పెండిగ్‌లో పెడుతోంది. హెల్త్‌  రియింబర్స్‌మెంట్‌, సరెండర్‌ లీవ్‌, జీపీఎఫ్‌, అడ్వాన్స్‌లు, పార్ట్‌ఫైనల్‌ విత్‌డ్రాయిల్‌ ఇలా అన్ని బిల్లులు నెలలుగా పెండిగ్‌లో ఉంటున్నాయి. దీంతో నెలసరి ఆదాయాలపైనే ఆధారపడిన ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల చెల్లించాల్సిన ఈఎంఐ (EMIs), బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,45,257 కోట్లు కాగా, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.1,08,212 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలకు అయ్యే వార్షిక వ్యయం రూ.25 వేలకోట్లుకాగా, పెన్షన్‌ చెల్లింపులు రూ.11 వేలకోట్లు, అంటే ప్రతినెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులకు చెల్లించేది కేవలం రూ.3 వేలకోట్లు. ఈ మాత్రం బడ్జెట్‌ను సైతం సకాలంలో విడుదల చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల. పెన్షన్‌దారులు, కాంట్రాక్టు సిబ్బంది పట్ల వ్యవహరించడం సిగ్గుచేటు ’ అన్నారు బండి సంజయ్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget