అన్వేషించండి

Bandi Sanjay: బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు- నక్సల్స్‌తో చర్చలు అనడం హాస్యాస్పదం: బండి సంజయ్

Bandi sanjay about Operation Kagar | బుల్లెట్, బ్యాలెట్ ఒకే ఒరలో ఉండవని.. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసుడే కావాలి” అన్నారు బండి సంజయ్.

Bandi Sanjay | కరీంనగర్: పేదరికం ఉన్నంతకాలం నక్సలిజం కొనసాగుతుందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. “నక్సల్స్‌తో చర్చలు జరపాలంటూ మాట్లాడటం హాస్యాస్పదం. గతంలో కాంగ్రెస్ నక్సలైట్లతో చర్చలు జరిపి ఏం సాధించింది?” అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్, అధికారానికి దూరమైన తర్వాత చర్చల మాటలు తీసుకురావడాన్ని ఆయన ఆక్షేపించారు. నక్సల్స్ చేతిలో వేలాది మంది అమాయకులు మరణించినప్పుడు ఆ సంఘటనలను "సామాజిక కోణం"గా ఎందుకు చూడలేకపోయారు అని పౌర హక్కుల నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

నక్సల్స్ వల్ల ఇప్పటివరకు సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 9 వేల మంది పోలీసులూ అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలన్న ఆలోచనే లేదని, నక్సల్స్ నిర్మూలన పూర్తి అయేంత వరకూ ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ ముక్త్ భారత్’ సాధించడమే లక్ష్యమని తెలిపారు.

విద్యార్థి దశలోనే ఏబీవీపీలో ఫుల్ టైమర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థుల సమస్యలపై పోరాడే సమయంలో తలపడ్డ కేసులే తనను రాజకీయాల్లోకి నడిపించాయని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్‌లో ABVP ఆధ్వర్యంలో జరిగిన “నక్సల్స్ నరమేధం - మేధోమథనం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నక్సల్స్ హింసకు గురైన ABVP కార్యకర్తలకు నివాళి అర్పించారు.

నక్సలిజం నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలోపు దేశాన్ని నక్సల్స్ విముక్తంగా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించి, దిశగా దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. గతంలో యూపీఏ పాలనలో 200కి పైగా జిల్లాల్లో ఉన్న నక్సలిజం, నేడు కేవలం 12 జిల్లాలకు పరిమితమైందని తెలిపారు.

నక్సలిజం వల్ల అభివృద్ధి ఆగిపోవడమే కాక, వేలాది మంది ప్రజలు, పోలీసులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలోకి నెట్టిందని అన్నారు. తుపాకులు చేతపట్టి పోరాటం చేస్తూ, పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చే వారు దేశ భక్తులుగా ఎలా పరిగణించగలమని ప్రశ్నించారు.

నక్సల్స్ చర్చలతో మారరని చరిత్రే చూపింది
నక్సల్స్‌తో గతంలో జరిగిన చర్చలు ఫలితాలివ్వలేదని గుర్తు చేస్తూ, తుపాకి కింద చర్చలేంటని ప్రశ్నించారు. నక్సలైట్లపై ప్రేమ చూపుతున్న నాయకులు నిజంగా గట్టిగా ఉండాలంటే, రాష్ట్రంలో నక్సలైట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయమని సవాల్ విసిరారు. పదేళ్లపాటు సీఎంగా ఉన్నప్పుడు చర్చల సంగతి ఎందుకు గుర్తుకు రాలేదని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.

అర్బన్ నక్సల్స్ అనే పేరుతో నిషేధిత సంఘాలకు మద్దతు ఇచ్చే నాయకులు విద్యా సంఘాల్లో సభ్యులను నియమించడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పేరుతో నక్సల్స్ కార్యకలాపాలను సమర్థించడం అమానుషమని, తుపాకుల వీడే వరకు సామాజిక కోణం చర్చకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
చత్తీస్‌గఢ్‌లో ‘జనతన సర్కార్’ పేరిట తుపాకులతో ప్రజల్ని చంపిన నక్సల్స్, పాఠశాలలు నిషేధించి విద్యను అడ్డుకున్నారన్నారాయన. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ హింసచేశారనీ, వారి కారణంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. దేశంలో పేదరికం ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉందని, ఇది వారిచేతమే సృష్టించబడిందని తేల్చిచెప్పారు.

బాలెట్ కాదు, బుల్లెట్ తత్వం నక్సలిజం
“మేము బాలెట్‌తో సమాధానం చెబుతాం, వాళ్లు బుల్లెట్‌తో జవాబిస్తం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసుడే కావాలి” అన్నారు. తుపాకులు చేతబట్టి హింసకు పాల్పడే వారికి ఏ మాత్రం చలించేది లేదని, పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలనకే కేంద్రం కట్టుబడిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget