అన్వేషించండి

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ముగిసిన బహుజన రాజ్యాధికార యాత్ర- కోనప్పపై ప్రవీణ్‌కుమార్ విమర్శలు

కుమ్రం భీం జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ముగిసిన బహుజన రాజ్యాధికార యాత్ర. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన యాత్రను జనవరి 2న ప్రారంభించారు. ఏడు మండలాల్లో ఈ పర్యటన సాగింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) నియోజకవర్గంలో బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర జనవరి 2వ తేది నుంచి జనవరి 12వ తేదీ వరకు కొనసాగింది. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొనేరు కోనప్ప ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. 12 రోజుల పాటు సిర్పూర్ (టి) నియోజకవర్గంలో కొనసాగిన బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతంగా పూర్తయిందని, ఈ నెల 16న కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభను ఎర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారు. జనవరి 2న ఈ బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించి నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, సిర్పూర్ (టి), కౌటాల, దెహేగాం, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి, బెజ్జూర్‌ మండలాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పించారు. కాగజ్‌నగర్‌ లోని ఓ వీధిలో కట్టెల మోపు తీసుకొస్తున్న ఓ మహిళ నుంచి తీసుకొని ఆయన కట్టేల మోపును మోసారు. ఆపై ఓ హోటల్లో చాయ్ చేస్తు సందడి చేశారు. 

పెద్దవాగులో కూలీన అందవెల్లి బ్రిడ్జిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాత్రలో ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్ట్ సమీపంలో పడవలో ప్రయాణించి ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ని మార్చడంతో 20,000 కోట్ల నష్టం, 2 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయాయన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంతోనే ఆపేసారన్నారు. నియోజకవర్గంలో ఉన్న గురుకులాల్లో విద్యార్థులకు సరైన మెను అందించడం లేదని, కొన్ని గ్రామాల్లో పాఠశాల భవనాలు సరిగ్గా లేవని దుయ్యబట్టారు. 

యాత్రలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటిస్తు ప్రజల సమస్యలను తెలుసుకుంటు గ్రామ గ్రామాల్లో పర్యటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చివరి రోజున బెజ్జూర్‌ మండలంలోని ఓ క్షవరం దుకాణంలో ఓ యువకుడికి క్షవరం చేశారు. వాడవాడలో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. బిసిలకు 27శాతం ఉన్న రిజర్వేషన్ ను 50% అందించాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. వచ్చే ఎన్నికలలో కోనప్పను ఓడించాలన్నారు.

రెండో విడత చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర  సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 12 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బహుజన రాజ్యాధికార యాత్ర ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రవీణ్‌కుమార్. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా పేపర్ మిల్లు కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. మిల్లు మేనేజ్మెంట్ స్థానిక కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, స్థానికేతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిఎస్పి సైనికులకు హాని జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని స్పష్టం చేశారు. బిఎస్పి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు అందిస్తామన్నారు. 

బెజ్జూర్ మండలం కుకుడ, పోతేపల్లి, సలుగుపల్లి, కోర్తగూడ గ్రామాల్లో పర్యటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... బెజ్జూర్ లో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి అధికార నాయకులు మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికలలో కోనేరు కొనప్ప ను ఓడించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna at Legend 10Years | పసుపు చీరలో సోనాల్ చౌహాన్..కవిత చెప్పిన బాలకృష్ణ | ABPKTR Angry on Leaders Party Change | పార్టీ మారుతున్న బీఆర్ఎస్ లీడర్లపై కేటీఆర్ ఫైర్ | ABP DesamNandamuri Balakrishna at Legend 10Years | లెజెండ్ రీరిలీజ్ లోనూ 100రోజులు ఆడుతుందన్న బాలకృష్ణ | ABPBIG Shocks to BRS | బీఆర్ఎస్ నుంచి వలసలు ఆపడం కష్టమేనా..!? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Embed widget