అన్వేషించండి

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ముగిసిన బహుజన రాజ్యాధికార యాత్ర- కోనప్పపై ప్రవీణ్‌కుమార్ విమర్శలు

కుమ్రం భీం జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో ముగిసిన బహుజన రాజ్యాధికార యాత్ర. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన యాత్రను జనవరి 2న ప్రారంభించారు. ఏడు మండలాల్లో ఈ పర్యటన సాగింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) నియోజకవర్గంలో బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర జనవరి 2వ తేది నుంచి జనవరి 12వ తేదీ వరకు కొనసాగింది. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొనేరు కోనప్ప ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. 12 రోజుల పాటు సిర్పూర్ (టి) నియోజకవర్గంలో కొనసాగిన బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతంగా పూర్తయిందని, ఈ నెల 16న కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభను ఎర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్ (టి) నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టారు. జనవరి 2న ఈ బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించి నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, సిర్పూర్ (టి), కౌటాల, దెహేగాం, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి, బెజ్జూర్‌ మండలాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పించారు. కాగజ్‌నగర్‌ లోని ఓ వీధిలో కట్టెల మోపు తీసుకొస్తున్న ఓ మహిళ నుంచి తీసుకొని ఆయన కట్టేల మోపును మోసారు. ఆపై ఓ హోటల్లో చాయ్ చేస్తు సందడి చేశారు. 

పెద్దవాగులో కూలీన అందవెల్లి బ్రిడ్జిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాత్రలో ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్ట్ సమీపంలో పడవలో ప్రయాణించి ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ని మార్చడంతో 20,000 కోట్ల నష్టం, 2 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయాయన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కు అంబేద్కర్ పేరు పెట్టడంతోనే ఆపేసారన్నారు. నియోజకవర్గంలో ఉన్న గురుకులాల్లో విద్యార్థులకు సరైన మెను అందించడం లేదని, కొన్ని గ్రామాల్లో పాఠశాల భవనాలు సరిగ్గా లేవని దుయ్యబట్టారు. 

యాత్రలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటిస్తు ప్రజల సమస్యలను తెలుసుకుంటు గ్రామ గ్రామాల్లో పర్యటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చివరి రోజున బెజ్జూర్‌ మండలంలోని ఓ క్షవరం దుకాణంలో ఓ యువకుడికి క్షవరం చేశారు. వాడవాడలో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారు. బిసిలకు 27శాతం ఉన్న రిజర్వేషన్ ను 50% అందించాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. వచ్చే ఎన్నికలలో కోనప్పను ఓడించాలన్నారు.

రెండో విడత చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర  సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 12 రోజులపాటు విజయవంతంగా కొనసాగింది. కాగజ్‌నగర్‌ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బహుజన రాజ్యాధికార యాత్ర ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రవీణ్‌కుమార్. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా పేపర్ మిల్లు కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. మిల్లు మేనేజ్మెంట్ స్థానిక కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, స్థానికేతరులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిఎస్పి సైనికులకు హాని జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని స్పష్టం చేశారు. బిఎస్పి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, గిరిజనులు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు అందిస్తామన్నారు. 

బెజ్జూర్ మండలం కుకుడ, పోతేపల్లి, సలుగుపల్లి, కోర్తగూడ గ్రామాల్లో పర్యటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... బెజ్జూర్ లో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పి అధికార నాయకులు మోసం చేశారన్నారు. వచ్చే ఎన్నికలలో కోనేరు కొనప్ప ను ఓడించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget