అన్వేషించండి

Pushkar Singh Dhami on UCC: మోదీ మరోసారి ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా యూసీసీ అమలు: ఉత్తరాఖండ్ సీఎం

Telangana News: యూసీసీని అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్ అని, బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని పుష్కర్ సింగ్ ధామి హైదరాబాద్ లో అన్నారు.

Pushkar Singh Dhami on UCC - హైదరాబాద్: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని అమలుచేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. దేశమంతా యూసీసీ అమలు కోసం ఎదురుచూస్తోందని.. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం కసిష్ ఫంక్షన్ హాల్ లో యువమోర్చా సమ్మేళనంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పుష్కర్ సింగ్ దామి మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ దేవ భూమి అని, తమ పుణ్యభూమికి ఎవరైనా రావొచ్చు అని తెలుగు ప్రజలను ఆహ్వానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. నేడు దేశమంతా మోదీ వైపు చూస్తోందన్నారు. మోదీకి సరిపోయే వ్యక్తి కోసం భూతద్దం చూసి వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడం లేదన్నారు. 
యువశక్తి మన ప్రధాన బలం అని, మన యువతే మోదీ భవిష్యత్ భారత నిర్మాణంలో కీలకంగా మారనున్నారు. యువత పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రధాని మోదీ ఎజెండా అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిచేది బీజేపీ అన్నారు. 

వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ లలో బీజేపీ పెద్దలు ప్రచారం చేయగా, తాను సైతం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనట్లు చెప్పారు. ఎటు చూసినా బీజేపీ, మోదీ వైపు ప్రజలు చూస్తున్నారని.. కేంద్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ హవా నడుస్తోందని, I.N.D.I.A కూటమిలో ప్రధాని అయ్యే వ్యక్తి ఎవరూ లేరని పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి రాజకీయాలు సరిగ్గా అర్థం కావడం లేదని, ఆ పార్టీ నేతలకు ఏకాభిప్రాయం ఉండదన్నారు.

దేశం కోసం, యువత కోసం మోదీ ప్రధాని కావాలి..
యువత భవిష్యత్ కోసం, దేశ రక్షణ కోసం నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. దేశం కోసం తాను ప్రధానిగా ఉండాలని మోదీ భావిస్తే, తన కుటుంబం కోసం, తన కోసం ప్రధాని పదవి కోరుకుంటున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత తరలి రావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. వయోజనులు అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు. దేశంలో శాంతి కొనసాగాలన్నా, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్నా బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు.
UCC, Pushkar Singh Dhami, Loksabha Elections 2024, Loksabha Polls 2024, Elections 2024, Kishan Reddy, Reservation News, Telugu News, BJP News, Hyderabad News
పుష్కర్ సింగ్ ధామి, లోక్ సభ ఎన్నికలు 2024, బీజేపీ, కిషన్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. డ్రగ్స్ వాడటం ఇదే తొలిసారి కాదా? శాంపిల్స్‌లో మరిన్ని అవశేషాలు

వీడియోలు

IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
Embed widget