అన్వేషించండి

TSRTC Electric Bus: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్సులకు ఫుల్‌ డిమాండ్‌-100శాతం ఆక్యుపెన్సీతో రికార్డ్‌

హైదరాబాద్‌ వాసులు ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో 100శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. మరిన్ని విద్యుత్‌ బస్సులను రోడ్డెక్కించేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ఆర్టీసీ.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గత నెలలోనే 25 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ). ఎలక్ట్రిక్‌ బస్సులు అలా రోడ్డెక్కాయో లేదో...  ఇలా ప్రయాణికుల మనసు దోచుకున్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు హైదరాబాద్‌ వాసులు ఇష్టపడుతున్నారు. దీంతో 25 ఎలక్ట్రిక్‌ బస్సులు ఫుల్‌ ఆక్యుపెన్సీతో  నడుస్తున్నారు. దీంతో మరిన్ని ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తోంది టీఎస్‌ఆర్టీసీ. 

గ్రేటర్‌ పరిధిలో తిరుగుతున్న 25 విద్యుత్‌ బస్సుల్లో 10 బస్సులను పుష్పక్‌ పేరుతో ఎయిర్‌పోర్టు వరకు నడుపుతున్నారు. మిగిలిన 15 బస్సులను బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌,  సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌ వరకు రెండు మార్గాల్లో నడుపుతున్నారు. ఈ బస్సులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఎలక్ట్రిక్‌ బస్సులో జర్నీ చేసేందుకు నగర ప్రయాణికులు  ఇష్టపడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్‌ బస్సుల్లో 100 శాతం ఆక్యూపెన్సీ నమోదవుతోంది. ఫలితంగా ఆర్టీసీకి లాభాల పంట పండుతోంది. 

ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతున్న బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌, సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌ మార్గాల్లో ఐటీ, బ్యాంకు, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో  ప్రయాణం చేస్తున్నారని సమాచారం. ప్రయాణ దూరం ఎక్కువైనా... ఏసీలో హ్యాపీగా వెళ్లొచ్చని వీరంతా ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారని అంచనా  వేస్తున్నారు. అంతేకాద... విద్యుత్‌ ఏసీ బస్సుల్లో టికెట్‌ చార్జీలు కూడా తక్కువే. సామాన్యులకు అందుబాటులోనే చార్జీలు ఉంటున్నాయి. 50 నుంచి 60 రూపాయలతోనే  ప్రయాణించవచ్చు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలతో పోలిస్తే.. 5రూపాయలు మాత్రమే అదనం. పైగా ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఏసీ ఉంటుంది. దీంతో... చాలా మంది ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రిఫర్‌  చేస్తున్నారు. ఇక... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్డుకు వెళ్లే పుష్పక్‌ బస్సులతో పోలిస్తే.. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో చార్జీలు చాలా తక్కువ. ఇది కూడా  ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణమని అంటున్నారు ఆర్టీసీ అధికారులు.

ఏదిఏమైనా ఎలక్ట్రిక్‌ బస్సులు.. హైదరాబాద్‌ నగర ప్రయాణికుల మనసు దోచుకుంటున్నాయి. దీంతో మరిన్ని ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది  టీఎస్‌ఆర్టీసీ. మరో వెయ్యి విద్యుత్‌ బస్సులను త్వరలోనే రోడ్డెక్కించబోతున్నారు. రెండు, మూడు నెలల్లో మరో వెయ్యి విద్యుత్‌ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ అధికారులు  ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల పర్యావరణ హానికలగదు. అందుకే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయాణికులకు చేరువ చేసి.. దశలవారీగా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని  ప్రయత్నిస్తోంది. 

హైదరాబాద్‌లో వాహన సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో... పొల్యూషన్‌ కూడా సృతి మించుతోంది. గాలి మొత్తం దుమ్ముదూళితో నిండిపోతోంది. వాయు కాలుష్యంతోపాటు  శబ్ద కాలుష్యం... నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణం ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయేలా చేస్తోంది. ఇలానే కొనసాగితే... హైదరాబాద్‌ కూడా పొల్యూషన్‌లో మరో  ఢిల్లీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే టీఎస్‌ఆర్టీసీ అధికారులు... ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు. నగరంలో పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే బస్సులను  తగ్గించి.. క్రమంలో ఎలక్ట్రిక్‌ బస్సులను నగర వాసులకు చేరువచేసే ప్రయత్నం చేస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల వాయు, శబ్ధ కాలుష్యం తగ్గుతుంది. దీని వల్ల వాతావరణంలో  ఆక్సిజన్‌ స్థాయి కూడా పెరుగుతుంది. అందుకే ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్యను పెంచబోతోంది టీఎస్‌ఆర్టీసీ.

హైదరాబాద్‌లో రెండు, మూడు నెలల్లో మరో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని అధికారులు ప్రకటించారు. అయితే... ఈ బస్సులో 50 మాత్రం ఏసీ బస్సులు.  మిగిలినవి నాన్‌ ఏసీ బస్సులు. ఈ బస్సులను పలు మార్గాల్లో నడపున్నారు. ఈ బస్సుల్లో చార్జీలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పారు. దీంతో ఎలక్ట్రిక్‌ బస్సులో  ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget