అన్వేషించండి

Telangana News : పాఠ్య పుస్తకాల వ్యవహారంపై గందరగోళం- ఇద్దరు అధికారులపై వేటు

Telugu Books : తెలుగు పాఠ్య పుస్తకాల్లో జరిగిన తప్పిదాలపై ఉన్నతాధికారులు ఇస్తున్న ఆదేశాలు కిందిస్థాయి అధికారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పూటకో ఆదేశాలు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Telangana News : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, తెలుగు పాఠ్యపుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సహా పలువురు మంత్రుల పేర్లను ముద్రించిన వ్యవహారంలో విద్యాశాఖ గందరగోళంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడంలో విద్యాశాఖ విఫలం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ పుస్తకాల్లో కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉన్న విషయం తెలియగానే మొదట ఆ పేజీని చించివేయాలని అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఆదేశాల మేరకు అనేక జిల్లాల్లోని అధికారులు ఆయా పేజీలను చింపివేశారు. అయితే, మళ్లీ డీఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు భాషా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు రిటర్న్ చేయాలని గురువారం పేర్కొన్నారు. మళ్ళీ ఏమైందో కానీ శుక్రవారం తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కెసిఆర్ తోపాటు మాజీ మంత్రుల పేర్లు ఉన్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుక వైపు గమ్ తో లేదా ఫెవికాల్ తో అతికించాలని సూచించారు. రెండు, మూడు రోజులుగా భిన్నమైన ఆదేశాలను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని స్కూళ్లలో తొలుత చింపి పారేసిన పేజీలు దొరకపోవడంతో టీచర్లు వాటిని జిరాక్స్ తీయించి అతికించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు ఆ పేజీని చింపి వేయాలని, ఆ తర్వాత పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని, మళ్లీ అతికించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం విద్యా శాఖలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే పుస్తకాలు పంపిణీ..

రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పార్టీ పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయన్న కారణంతో దాదాపు 25 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు. ఆయా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు చేర్చారు. ఈ చర్యను మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. 

గందరగోళంగా అధికారులు ఆదేశాలు 

ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ఇచ్చిన ఆదేశాలు అందరుగోళంగా మారాయి. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు వచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. 'ఈ సంవత్సరం అన్ని తెలుగు పాఠ్య పుస్తకాలపై పొరపాటున మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ముద్రితమయ్యాయి. ఈ పేజీ వెనుక భాగంలో జాతీయగీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ ఉన్నాయి. ఈ పేజీని బ్లేడ్ లేదా కత్తెరతో జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ పేజీని అదే పుస్తకం కవర్ పేజీ వెనుక భాగంలో అతికించాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాజీ మంత్రులు, అధికారులు పేర్లు ఉన్న పేజీ కనబడకుండా ఉండేలా జాతీయగీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ కనిపించేలా జాగ్రత్త పడాలి' అని అధికారులకు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పూర్తి చేయాలని పలు జిల్లాల డీఈవోలు ఆదేశాలు ఇచ్చారు. తమ కాంప్లెక్స్ పరిధిలోని పుస్తకాలను ఆయా హెచ్ఎంలు తమ వద్దకు తెప్పించుకొని పేజీని చింపి, అతికించి తిరిగి సంబంధిత స్కూల్లో ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. శుక్రవారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, పూర్తయిన తరువాత తమ కాంప్లెక్స్ పరిధిలో అతికించడం పూర్తయిందని డెకరేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ఆదేశాలు గందరగోళంగా ఉండడంతో ఏం చేయాలో తెలియక హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో జరిగిన తప్పిదంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.

బాధ్యులైన అధికారులపై చర్యలు.. 

తెలుగు పాఠ్య పుస్తకాల్లో జరిగిన తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్స్ట్ బుక్ లో వచ్చిన తప్పులను సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్య పుస్తకాల బాధ్యతలు నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్ కు బాధితులు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్  ముద్రణ సేవలు విభాగం డైరెక్టర్ గా బాధ్యతలు కేటాయించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget