అన్వేషించండి

ABP Desam Health Conclave 2025: సాంకేతికతతో కూడిన వైద్య విద్యే భవిష్యత్ అవసరాలు తీర్చుతుంది: ఏబీపీ దేశం ఎన్‌క్లేవ్‌లో ప్రీతిరెడ్డి

ABP Desam Health Conclave 2025: సంప్రదాయ బోధన పద్ధతుల స్థానంలో సరికొత్త సాంకేతిక విధానంలో ట్రైనింగ్ చేయగలిగితేనే వైద్య విభాగంలో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు.

ABP Desam Health Conclave 2025: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్ 2025లో ప్రస్తుత ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యను ఎలా పునరుద్ధరించాలనే దానిపై ఒక కీలకమైన చర్చ జరిగింది. వైద్య విద్యార్థులను కేవలం ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడమే కాకుండా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై  మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ప్రపంచం మహమ్మారుల నుంచి AI పురోగతికి, వాతావరణ మార్పుల నుంచి పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల వరకు మారుతున్నప్పుడు, మనం వైద్యులకు శిక్షణ ఇచ్చే విధానం ఇకపై ఒకేలా ఉండకూడదు" అని ఆమె నొక్కి చెప్పారు.

సాంకేతికతతో కూడిన వైద్య విద్య: 

ప్రస్తుత సంప్రదాయ బోధనా పద్ధతులు పాతబడ్డాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అధునాతన సాంకేతికతలను వైద్య విద్యలో విలీనం చేయడం చాలా అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు MBBS పూర్తి చేయగానే ఈ సాంకేతికతలను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండేలా  ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ మోడ్యూల్స్ ఉండాలని ఆమె సూచించారు. వైద్య విద్యను కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా, పరిశోధన,  ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్ సెంటర్లు) సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, 50-50 నిష్పత్తిలో అకడమిక్స్, పరిశోధన ఉండాలని ఆమె అన్నారు, ఇది విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తుందని తెలిపారు.

ఆచరణాత్మక శిక్షణ -కమ్యూనికేషన్:

వైద్యులు కేవలం సిద్ధాంత పరిజ్ఞానంతో సరిపోదని, రోగులతో వ్యవహరించే ఆచరణాత్మక అనుభవం మొదటి సంవత్సరం నుంచే అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు, విద్యార్థులు నేర్చుకుంటున్న దానికి మధ్య పెద్ద అంతరం ఉందని ఆమె అంగీకరించారు. వైద్యులకు కమ్యూనికేషన్ నైపుణ్యం అత్యంత ముఖ్యమైనదని, రోగులతో మాట్లాడటం, వారి హిస్టరీని పూర్తిగా తెలుసుకోవడం, పరీక్షించడం వంటివి ముఖ్యమని ఆమె నొక్కిచెప్పారు, కేవలం పరికరాలపై ఆధారపడటం సరికాదని అన్నారు. సిమ్యులేషన్ ల్యాబ్‌లలో శిక్షణ పొంది, ఆ తర్వాత రోగులను చూడటం ద్వారా వారు మరింత సుశిక్షితులు అవుతారని ఆమె తెలిపారు.

ప్రజా ఆరోగ్యం -సానుభూతి ప్రాముఖ్యత: 

ఇంటర్న్‌షిప్ రొటేషన్లలో నివారణ, ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) లలో తప్పనిసరి పోస్టింగ్‌లు ఉండాలని డాక్టర్ ప్రీతి రెడ్డి సూచించారు. ఇది విద్యార్థులకు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి,  మెరుగైన వైద్యులుగా మారడానికి సహాయపడుతుంది. వైద్యులకు సానుభూతి (ఎంపతీ), దయ, నీతి (ఎథిక్స్) ఉండటం చాలా ముఖ్యమని, వారు యంత్రాలతో కాదు, ప్రాణాలతో వ్యవహరిస్తారని గుర్తు చేశారు. "వైద్యులకు నైపుణ్యాలు ఉన్నా, సోల్‌ లేకపోతే పూర్తి వైద్యులు కాలేరు" అని ఆమె అన్నారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ,భవిష్యత్ సన్నద్ధత: 

వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, తమ వృత్తిని ఆసక్తితో ఎంచుకోవాలని ప్రీతిరెడ్డి సూచించారు. వైద్య విద్యా సంస్థలు సహాయకారిగా ఉండాలి, క్రమశిక్షణతో కూడిన, విశ్రాంతి వాతావరణాన్ని కల్పించాలి, పీర్ కౌన్సిలింగ్ వంటివి అందించాలి అని అన్నారు. భవిష్యత్ సిద్ధంగా ఉండే MBBS గ్రాడ్యుయేట్ అంటే సాంకేతికంగా నిష్ణాతులు, నైతికంగా ఉన్నతమైనవారు, దయగలవారు, సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారు అని డాక్టర్ ప్రీతి రెడ్డి నిర్వచించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వృద్ధి చెందుతున్న తీరు, NEP 2020 వంటి అంశాలు విదేశాలకు వెళ్లే ధోరణిని తిప్పికొడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో సరైన దిశలో పని చేయడం విజయానికి కీలకం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పిన స్ఫూర్తిదాయక మాటలైన "పాలు అమ్మినా, పూలు అమ్మినా"కి టెక్నాలజీని జోడించి వివరించారు. ఈ సంస్కరణలన్నీ భారతదేశ వైద్యులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget