అన్వేషించండి

ABP Desam Health Conclave 2025: సాంకేతికతతో కూడిన వైద్య విద్యే భవిష్యత్ అవసరాలు తీర్చుతుంది: ఏబీపీ దేశం ఎన్‌క్లేవ్‌లో ప్రీతిరెడ్డి

ABP Desam Health Conclave 2025: సంప్రదాయ బోధన పద్ధతుల స్థానంలో సరికొత్త సాంకేతిక విధానంలో ట్రైనింగ్ చేయగలిగితేనే వైద్య విభాగంలో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు.

ABP Desam Health Conclave 2025: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్ 2025లో ప్రస్తుత ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యను ఎలా పునరుద్ధరించాలనే దానిపై ఒక కీలకమైన చర్చ జరిగింది. వైద్య విద్యార్థులను కేవలం ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడమే కాకుండా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై  మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ప్రపంచం మహమ్మారుల నుంచి AI పురోగతికి, వాతావరణ మార్పుల నుంచి పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల వరకు మారుతున్నప్పుడు, మనం వైద్యులకు శిక్షణ ఇచ్చే విధానం ఇకపై ఒకేలా ఉండకూడదు" అని ఆమె నొక్కి చెప్పారు.

సాంకేతికతతో కూడిన వైద్య విద్య: 

ప్రస్తుత సంప్రదాయ బోధనా పద్ధతులు పాతబడ్డాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అధునాతన సాంకేతికతలను వైద్య విద్యలో విలీనం చేయడం చాలా అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు MBBS పూర్తి చేయగానే ఈ సాంకేతికతలను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండేలా  ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ మోడ్యూల్స్ ఉండాలని ఆమె సూచించారు. వైద్య విద్యను కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా, పరిశోధన,  ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్ సెంటర్లు) సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, 50-50 నిష్పత్తిలో అకడమిక్స్, పరిశోధన ఉండాలని ఆమె అన్నారు, ఇది విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తుందని తెలిపారు.

ఆచరణాత్మక శిక్షణ -కమ్యూనికేషన్:

వైద్యులు కేవలం సిద్ధాంత పరిజ్ఞానంతో సరిపోదని, రోగులతో వ్యవహరించే ఆచరణాత్మక అనుభవం మొదటి సంవత్సరం నుంచే అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు, విద్యార్థులు నేర్చుకుంటున్న దానికి మధ్య పెద్ద అంతరం ఉందని ఆమె అంగీకరించారు. వైద్యులకు కమ్యూనికేషన్ నైపుణ్యం అత్యంత ముఖ్యమైనదని, రోగులతో మాట్లాడటం, వారి హిస్టరీని పూర్తిగా తెలుసుకోవడం, పరీక్షించడం వంటివి ముఖ్యమని ఆమె నొక్కిచెప్పారు, కేవలం పరికరాలపై ఆధారపడటం సరికాదని అన్నారు. సిమ్యులేషన్ ల్యాబ్‌లలో శిక్షణ పొంది, ఆ తర్వాత రోగులను చూడటం ద్వారా వారు మరింత సుశిక్షితులు అవుతారని ఆమె తెలిపారు.

ప్రజా ఆరోగ్యం -సానుభూతి ప్రాముఖ్యత: 

ఇంటర్న్‌షిప్ రొటేషన్లలో నివారణ, ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) లలో తప్పనిసరి పోస్టింగ్‌లు ఉండాలని డాక్టర్ ప్రీతి రెడ్డి సూచించారు. ఇది విద్యార్థులకు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి,  మెరుగైన వైద్యులుగా మారడానికి సహాయపడుతుంది. వైద్యులకు సానుభూతి (ఎంపతీ), దయ, నీతి (ఎథిక్స్) ఉండటం చాలా ముఖ్యమని, వారు యంత్రాలతో కాదు, ప్రాణాలతో వ్యవహరిస్తారని గుర్తు చేశారు. "వైద్యులకు నైపుణ్యాలు ఉన్నా, సోల్‌ లేకపోతే పూర్తి వైద్యులు కాలేరు" అని ఆమె అన్నారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ,భవిష్యత్ సన్నద్ధత: 

వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, తమ వృత్తిని ఆసక్తితో ఎంచుకోవాలని ప్రీతిరెడ్డి సూచించారు. వైద్య విద్యా సంస్థలు సహాయకారిగా ఉండాలి, క్రమశిక్షణతో కూడిన, విశ్రాంతి వాతావరణాన్ని కల్పించాలి, పీర్ కౌన్సిలింగ్ వంటివి అందించాలి అని అన్నారు. భవిష్యత్ సిద్ధంగా ఉండే MBBS గ్రాడ్యుయేట్ అంటే సాంకేతికంగా నిష్ణాతులు, నైతికంగా ఉన్నతమైనవారు, దయగలవారు, సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారు అని డాక్టర్ ప్రీతి రెడ్డి నిర్వచించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వృద్ధి చెందుతున్న తీరు, NEP 2020 వంటి అంశాలు విదేశాలకు వెళ్లే ధోరణిని తిప్పికొడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో సరైన దిశలో పని చేయడం విజయానికి కీలకం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పిన స్ఫూర్తిదాయక మాటలైన "పాలు అమ్మినా, పూలు అమ్మినా"కి టెక్నాలజీని జోడించి వివరించారు. ఈ సంస్కరణలన్నీ భారతదేశ వైద్యులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget