అన్వేషించండి

ABP Desam Health Conclave 2025: సాంకేతికతతో కూడిన వైద్య విద్యే భవిష్యత్ అవసరాలు తీర్చుతుంది: ఏబీపీ దేశం ఎన్‌క్లేవ్‌లో ప్రీతిరెడ్డి

ABP Desam Health Conclave 2025: సంప్రదాయ బోధన పద్ధతుల స్థానంలో సరికొత్త సాంకేతిక విధానంలో ట్రైనింగ్ చేయగలిగితేనే వైద్య విభాగంలో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుందని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు.

ABP Desam Health Conclave 2025: ABP దేశం హెల్త్ కాన్‌క్లేవ్ 2025లో ప్రస్తుత ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యను ఎలా పునరుద్ధరించాలనే దానిపై ఒక కీలకమైన చర్చ జరిగింది. వైద్య విద్యార్థులను కేవలం ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడమే కాకుండా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై  మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ప్రపంచం మహమ్మారుల నుంచి AI పురోగతికి, వాతావరణ మార్పుల నుంచి పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యల వరకు మారుతున్నప్పుడు, మనం వైద్యులకు శిక్షణ ఇచ్చే విధానం ఇకపై ఒకేలా ఉండకూడదు" అని ఆమె నొక్కి చెప్పారు.

సాంకేతికతతో కూడిన వైద్య విద్య: 

ప్రస్తుత సంప్రదాయ బోధనా పద్ధతులు పాతబడ్డాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) వంటి అధునాతన సాంకేతికతలను వైద్య విద్యలో విలీనం చేయడం చాలా అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు MBBS పూర్తి చేయగానే ఈ సాంకేతికతలను ఉపయోగించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండేలా  ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ మోడ్యూల్స్ ఉండాలని ఆమె సూచించారు. వైద్య విద్యను కేవలం విద్యా కేంద్రంగానే కాకుండా, పరిశోధన,  ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్ సెంటర్లు) సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, 50-50 నిష్పత్తిలో అకడమిక్స్, పరిశోధన ఉండాలని ఆమె అన్నారు, ఇది విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తుందని తెలిపారు.

ఆచరణాత్మక శిక్షణ -కమ్యూనికేషన్:

వైద్యులు కేవలం సిద్ధాంత పరిజ్ఞానంతో సరిపోదని, రోగులతో వ్యవహరించే ఆచరణాత్మక అనుభవం మొదటి సంవత్సరం నుంచే అవసరమని డాక్టర్ ప్రీతి రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు, విద్యార్థులు నేర్చుకుంటున్న దానికి మధ్య పెద్ద అంతరం ఉందని ఆమె అంగీకరించారు. వైద్యులకు కమ్యూనికేషన్ నైపుణ్యం అత్యంత ముఖ్యమైనదని, రోగులతో మాట్లాడటం, వారి హిస్టరీని పూర్తిగా తెలుసుకోవడం, పరీక్షించడం వంటివి ముఖ్యమని ఆమె నొక్కిచెప్పారు, కేవలం పరికరాలపై ఆధారపడటం సరికాదని అన్నారు. సిమ్యులేషన్ ల్యాబ్‌లలో శిక్షణ పొంది, ఆ తర్వాత రోగులను చూడటం ద్వారా వారు మరింత సుశిక్షితులు అవుతారని ఆమె తెలిపారు.

ప్రజా ఆరోగ్యం -సానుభూతి ప్రాముఖ్యత: 

ఇంటర్న్‌షిప్ రొటేషన్లలో నివారణ, ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) లలో తప్పనిసరి పోస్టింగ్‌లు ఉండాలని డాక్టర్ ప్రీతి రెడ్డి సూచించారు. ఇది విద్యార్థులకు సమాజ అవసరాలను అర్థం చేసుకోవడానికి,  మెరుగైన వైద్యులుగా మారడానికి సహాయపడుతుంది. వైద్యులకు సానుభూతి (ఎంపతీ), దయ, నీతి (ఎథిక్స్) ఉండటం చాలా ముఖ్యమని, వారు యంత్రాలతో కాదు, ప్రాణాలతో వ్యవహరిస్తారని గుర్తు చేశారు. "వైద్యులకు నైపుణ్యాలు ఉన్నా, సోల్‌ లేకపోతే పూర్తి వైద్యులు కాలేరు" అని ఆమె అన్నారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ,భవిష్యత్ సన్నద్ధత: 

వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, తమ వృత్తిని ఆసక్తితో ఎంచుకోవాలని ప్రీతిరెడ్డి సూచించారు. వైద్య విద్యా సంస్థలు సహాయకారిగా ఉండాలి, క్రమశిక్షణతో కూడిన, విశ్రాంతి వాతావరణాన్ని కల్పించాలి, పీర్ కౌన్సిలింగ్ వంటివి అందించాలి అని అన్నారు. భవిష్యత్ సిద్ధంగా ఉండే MBBS గ్రాడ్యుయేట్ అంటే సాంకేతికంగా నిష్ణాతులు, నైతికంగా ఉన్నతమైనవారు, దయగలవారు, సమాజం పట్ల శ్రద్ధ ఉన్నవారు అని డాక్టర్ ప్రీతి రెడ్డి నిర్వచించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ వృద్ధి చెందుతున్న తీరు, NEP 2020 వంటి అంశాలు విదేశాలకు వెళ్లే ధోరణిని తిప్పికొడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో సరైన దిశలో పని చేయడం విజయానికి కీలకం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పిన స్ఫూర్తిదాయక మాటలైన "పాలు అమ్మినా, పూలు అమ్మినా"కి టెక్నాలజీని జోడించి వివరించారు. ఈ సంస్కరణలన్నీ భారతదేశ వైద్యులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget