By: ABP Desam | Updated at : 28 Nov 2022 09:58 PM (IST)
Edited By: jyothi
సునీతా లక్ష్మారెడ్డి
Sunitha Laxamarddy: మారుతున్న కాలానికి అనుగుణంగా అమ్మాయిలకు ప్రోత్సాహాన్నిచ్చి సాంకేతిక రంగంలో తగిన పాత్రను పోషించే విధంగా చూడాలని తల్లిదండ్రులకు తెలంగాణ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో విజ్ఞాన దర్శిని, మహిళ కమిషన్ ఆధ్వర్యంలో "సాంకేతిక రంగంలో మహిళల పాత్ర" (విమెన్ ఇన్ సైన్స్) పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సైన్సులో మహిళల శాతం చాలా తక్కువగా ఉన్నదని తెలిపారు. అమ్మాయిలను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తరపున విజ్ఞాన దర్శిని అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ రోజు సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో @SCWTelangana మరియు విజ్ఞాన దర్శిని ఎన్జీఓ సారథ్యంలో నిర్వహించిన "విమెన్ ఇన్ సైన్స్" కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై ఫోటో ఎక్సిబిషన్ ను ప్రారంభించి అనంతరం సెమినార్ లో ప్రసంగించడం జరిగింది. @WCDTelangana pic.twitter.com/KgltXgwk9p
— Vakiti Sunitha Laxma Reddy (@sunitavakiti) November 28, 2022
ఇందులో 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న ఆమ్మాయిలకు ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారో అన్న విషయాన్ని మరచిపోకుండా తమ చదువు సంధ్యలతోపాటు తమ ఎదుగుదల కోసమే చూడాలని సూచించారు. ఆకర్షణలకు లోనై తమ బంగారు జీవితాన్ని, తమ తల్లిదండ్రుల కష్టాన్ని నిర్వీర్యం చేయవద్దని హెచ్చరించారు.
ఈ రోజు ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/GA5VIryR0l
— Vakiti Sunitha Laxma Reddy (@sunitavakiti) November 27, 2022
అంతకు ముందు అంటే ఈరోజు వేకువ జామునే ఏడు పాయల శ్రీ వన దుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకులతో వేదాశీర్వచనం అందించారు.
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Hyderabad Traffic: హైదరాబాదీలు జర సోచో - ఆ రూట్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
మీరు పెట్ లవర్సా ? - పెటెక్స్ విశేషాలు ఇవిగో
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!